Home » బాలయ్య కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ.. వైరల్..!

బాలయ్య కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ.. వైరల్..!

by Anji
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఎన్టీఆర్ వర్థంతి కావడంతో తొలుత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఇక ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి విబేధాలు బయటపడ్డాయి. 

ntr-fans-warning

Advertisement

 

ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాస్త హడావిడి చేసారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న తరువాత ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులను ఆదేశించారు. చెప్పినట్టుగానే అనుచరులు తొలగించారు. దీంతో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం అతని అభిమానులకు అస్సలు నచ్చలేదట. దీంతో ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన బాలకృష్ణ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే బాలకృష్ణను, టీడీపీ పెద్దలను హెచ్చరిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

balakrishna-and-ntr

” తారక్ అన్న కోసం మేమంతా

అందరికీ నమస్కారం..

Advertisement

తమ అభిమానుల కోసం తపన పడే నటుల్లో మన తారక్ అన్న ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.. కానీ ఆయన ప్రతీ నిమిషం అవమానాలకు గురవుతుంటే ఆయన అభిమానులుగా మాకు గుండెల్లో నిప్పుల కొలిమిగా రగులుతోంది. అయినా సరే ఆయన గత నెలలో మమ్ముల్ని ఉద్దేశించి చెప్పి మాటలు.. కొద్దిగా సంయమనం పాటించండి అని.. ఇన్నాళ్లు మేము అదే సంయమనంతో ఉన్నాం.. కానీ ఇప్పుడు కుదరదు..

“దేవర ఇన్నాళ్లు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు.. ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా.. మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బహిరంగంగా బాలకృష్ణ తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న టీడీపీ వాళ్లకు చెబుతుంటే.. తారక్ అన్నని ఎంతలా ద్వేషిస్తున్నారో తలచుకొని బరువెక్కిన హృదయంతో కళ్లు కన్నీటితో కారు మబ్బులు కమ్మేశాయ్.. 

బావ కళ్లలో ఆనందం కోసం ఆ నాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిన, దివంగత నందమూరి హరికృష్ణ గారిని మరణ అంచుల్లో ఉన్నా వెంటాడారు. ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు. ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెబుతున్నాం. ఇన్నాళ్లు సహించాం.. త్వరలో మీ అహంకారం అణచి.. మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం.. ఈసారి బ్యాలెట్ బాక్సులు భయంతో భీతెక్కుతాయి. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అక్కడా అని చాటి చెప్పకపోతే దీంతల్లి.. ఈ సారి మీకు మాత్రం రాజకీయ బిచ్చగాళ్లను చేయడం నిశ్చయం. అందుకు ప్రతీ ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు. మా అందరిలో ఇప్పుడు ఆగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు.. మీ అందరినీ వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. 

జై ఎన్టీఆర్ ! జై జై ఎన్టీఆర్ !! ”

అని ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట ప్రచురించిన ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading