Home » ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారా..?

ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారా..?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్యంగా యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు పరుశురాం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన‌ గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా క్రేజీ దర్శకుడిగా మారారు. ఆ తరువాత ఈ ఏడాది మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసి మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ఈ స్టార్ ద‌ర్శ‌కునికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Also Read : సినిమా ఇండ‌స్ట్రీకి రావడం కోసం వివి వినాయ‌క్ ఎన్ని బాధ‌లు ప‌డ్డాడో తెలుసా ?

Advertisement

ప్ర‌ధానంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి ప‌ర‌శురాం ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ తో కలిసి పనిచేయాలని చాలామంది నిర్మాతలు ఆశపడుతూ ఉంటారు. కానీ ఆయన అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా.. పరశురాంతో సినిమా తీసేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read : రణ్‌వీర్‌-దీపికా విడాకులపై క్లారిటీ..!

ఓ సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో పరశురాం కథ సిద్ధం చేస్తున్నట్లు.. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 రోజులపాటు కాల్షీట్స్ ఇచ్చార‌ట‌. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే పరశురాం, పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ కథను వినిపించడానికి రెడీతున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్ వినిపిస్తోంది.

Also Read : “ఆచార్య” ఫ్లాప్….చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ ల‌కు ఎంత‌ ఇచ్చారో తెలుసా..?

 

Visitors Are Also Reading