Home » కృష్ణ అంత్యక్రియల విషయం లో మహేష్ బాబు తప్పు చేశాడా…?

కృష్ణ అంత్యక్రియల విషయం లో మహేష్ బాబు తప్పు చేశాడా…?

by AJAY
Published: Last Updated on
Ad

రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం పై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది టాలీవుడ్ పెద్దలు సైతం మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం… కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే మహేష్ బాబు కుటుంబ సభ్యులు కృష్ణ అంత్యక్రియలను పద్మాలయ స్టూడియోస్ లో నిర్వహిద్దామని చెప్పారట. కానీ మహేష్ బాబు వినకుండా కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తులు మరణిస్తే వారి అంత్యక్రియలను సొంత స్థాలల్లో నిర్వహిస్తారు. ఇటీవల మరణించిన కృష్ణంరాజు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించారు.

Advertisement

అదేవిధంగా ఏఎన్ఆర్ అత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించి అక్కడే స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ అంత్యక్రియలు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసి అక్కడ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కృష్ణ అంత్యక్రియలను సైతం పద్మాలయ స్టూడియోస్ లో నిర్వహించి స్థూపాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో మహేష్ బాబు తప్పు చేశాడు అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించి పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తన తల్లి ఇందిరా దేవి, అన్న రమేష్ బాబు అంత్యక్రియలు సైతం మహాప్రస్థానంలో చేయడంతో అక్కడే తండ్రి అంత్యక్రియలు కూడా చేశాడన్న వాదన వినిపిస్తోంది.

Visitors Are Also Reading