Home » మహేష్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అంతేనా…?

మహేష్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అంతేనా…?

by Azhar
Ad
టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా థియేటర్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు మహేష్ గురించి ఓ విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. అది ఏంటంటే… మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పని అంతే అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఇలా ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కూడా జరిగింది. వారెవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోద్కర్ తెలుగులో మొదటి సినిమా వంశీ. ఇందులో సూపర్ స్టార్ కు జంటగా నటించగా.. ఈ  సినిమా అంతగా ఆడలేదు. అనంతరం చేసిన అంజి సినిమా కూడా డిజాస్టర్ కావడంలో మళ్ళీ అవకాశాలు రాలేదు.. కానీ ఆ తర్వాత ఈమె మహేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ టక్కరిదొంగ సినిమాలో తనతో జత కట్టారు బిపాసా బసు లీసారే కానీ ఈ సినిమా విజయం సాధించకపోవడంతో వీరికీ ఛాన్సులు రాలేదు. ఇక మహేష్ అతిథి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమృతరావు పరిస్థితి కూడా అదే. అతిథి అభిమానులను ఆకట్టుకోకపోవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు.
మహేష్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే తో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు ఈ సినిమా విజయం అందించలేదు. ఆ తర్వాత చేసిన దోచేయ్ కూడా ప్లాప్ అవడంతో టాలీవుడ్ లో నిలవలేదు. ఇక కొరటాల డైరెక్షన్ లో మహేష్ బాబు సీఎంగా వచ్చిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకీ వచ్చిన కియారా అద్వానీకీ.. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆ తర్వాత చేసిన వినయ విధేయ రామ ప్లాప్ తో ఇంతకాలం తెలుగు సినిమాలకు దూరం అయింది.

Advertisement

Visitors Are Also Reading