Home » యముడికి మొగుడు సినిమా లాసులను చిరంజీవి ఎందుకు భరించారు…?

యముడికి మొగుడు సినిమా లాసులను చిరంజీవి ఎందుకు భరించారు…?

by AJAY
Ad

ఈ మధ్యకాలంలో సినిమాలకు లాసులు వస్తే హీరోలు భరించడం చూస్తూనే ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే హీరోలు సైతం బాధ్యతగా తీసుకుని తమ రెమ్యూనరేషన్ నుండి డిస్ట్రిబ్యూటర్లకు కొంత ఇచ్చి లాసుల నుండి గట్టెక్కిస్తున్నారు. అయితే హీరోలు అలా లాస్ లను భరించడం ఇప్పుడు వచ్చింది మాత్రమే కాదు. ఒకప్పటి నుండి హీరోలు ఇలా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ సినిమాకు లాసులు రావడంతో తానే భరించాడు.

Also Read:  ప్రియురాలితో యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్… వైరల్ అవుతున్న ఫోటోలు…!

Advertisement

 

ఈ విషయాన్ని టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత జివి.నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవి. నారాయణరావు చిరంజీవి రజనీకాంత్ తో కలిసి దేవాంతకుడు సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ రజనీకాంత్ కు ఆ తర్వాత కుదరకపోవడంతో ఆయన నటించలేదట.

Also Read: త్వరలో కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్… ? అఫీషియల్ అంటూ కన్ఫామ్ చేశాడుగా…!

Advertisement

దాంతో సుమన్ హీరోగా ఎంపిక చేశామని ఆ తరవాత చేశామని చివరికి కథ విషయంలో రెండో పాత్రను తగ్గించామని అన్నారు. ఆ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా సూపర్ హిట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత చిరుతో మరో సినిమా చేశామని అన్నారు. ఆ సినిమానే యముడికి మొగుడు అని జీవి నారాయణరావు తెలిపారు. ఆ సినిమాను చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించామని అన్నారు.

ఆ సినిమా తర్వాత చిరంజీవితో కలిసి చేస్తేనే ఆ బ్యానర్ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే యముడికి మొగుడు సినిమాకు కోటి 5 లక్షల బడ్జెట్ వేసుకుంటే అధికాస్తా కోటి 15 లక్షల రూపాయల వరకు వెళ్లిందని చెప్పారు. కానీ సినిమా విడుదలయ్యాక లాభాలు మాత్రం తక్కువగా వచ్చాయని అన్నారు. దాంతో చిరంజీవి తలో 5 లక్షల రూపాయలు ఇచ్చారని జీవి నారాయణరావు వెల్లడించారు.

Also Read:  ఈ 3 లక్షణాలున్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోరాదు.. కారణం ఇదే..!!

Visitors Are Also Reading