Home » మహేష్ నమ్రతల పెళ్లి కోసం ఇందిరా దేవి అంత కష్టపడ్డారా…? కృష్ణ నో చెప్పడం తో ఆమె ఏం చేశారంటే..?

మహేష్ నమ్రతల పెళ్లి కోసం ఇందిరా దేవి అంత కష్టపడ్డారా…? కృష్ణ నో చెప్పడం తో ఆమె ఏం చేశారంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో చాలా మంది సెల‌బ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ అందులో కొంత‌మంది మాత్రమే క‌లిసి ఉంటున్నారు. కొన్నేళ్ల పాటూ డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న క‌పుల్స్ కూడా విడిపోయారు. అయితే క‌లిసి ఉంటూ చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్న జంట‌ల్లో మ‌హేశ్ బాబు న‌మ్ర‌త కూడా ఉంటారు. వీరిద్ద‌రూ క‌లిసి వంశీ సినిమాలో న‌టించారు. ఆ సినిమా స‌మ‌యంలోనే ప్రేమ‌లో పడ్డారు.

Advertisement

ఆ త‌ర‌వాత ప్రేమ‌లో మునిగితేలిన ఈ జంట పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే వీరిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌టానికి అస‌లు కార‌ణం మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరా దేవి గారు అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. రీసెంట్ గా ఇందిరా దేవి అనారోగ్యంతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇందిరాదేవికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు కొన్ని సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

అందులో మ‌హేశ్ బాబు న‌మ్ర‌త‌ల పెళ్లి మ్యాట‌ర్ కూడా ఉంది. మ‌హేశ్ బాబు న‌మ్ర‌త పెళ్లి జ‌ర‌గ‌టానికి ఎలా కార‌ణం అయ్యారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మ‌హేశ్ బాబు న‌మ్ర‌త‌ల ల‌వ్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు ఇష్టం లేద‌ట‌. కృష్ణ మ‌హేశ్ బాబుకు తెలుగు అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకున్నార‌ట‌. దాంతో మ‌హేశ్ బాబు న‌మ్ర‌త పెళ్లికి నో చెప్పార‌ట‌.

అయిన‌ప్ప‌టికీ మ‌హేశ్ బాబు న‌మ్ర‌త‌ను మ‌ర్చిపోలేక‌పోయారు. అంతే కాకుండా తండ్రి చెప్పినా విన‌కుండా విన‌కుండా న‌మ్ర‌త‌ను ముంబాయిలో పెళ్లి చేసుకున్నారు. దాంతో కృష్ణ మ‌హేశ్ బాబు పై కోప్ప‌డ్డారు. కాగా ఆ స‌మ‌యంలో ఇందిరాదేవి క‌ల్పిచుకుని కృష్ణ‌ను కూర్చోబెట్టి మాట్లాడార‌ట‌. ఇందిరా దేవి క‌ల్పించుకుని ఒప్పించ‌డంతో కృష్ణ ఇందిరా దేవి క‌లిసి వెంటనే విమానంలో వెళ్లి మ‌హేశ్ న‌మ్రత‌ల‌ను ఆశీర్వించార‌ట‌.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

Visitors Are Also Reading