Home » రేటింగ్స్ ను తిరగరాసిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్…!

రేటింగ్స్ ను తిరగరాసిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్…!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనేది జరిగితే దాని హైప్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ గురించి ఏ రకమైన ప్రమోషన్స్ అనేవి చేయకపోయినా ప్రజలు ఈ మ్యాచ్ ను చూస్తారు. ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా రెండు దేశాల ప్రజలు ఎదురు చూస్తారు. అయితే వీరు ఎదురు చూసినట్లే నిన్న ఇండియా, పాకిస్థాన్ మాట్లా మధ్య మ్యాచ్ జరిగింది.

Advertisement

ఆసియా కప్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠంగా సాగింది. మొదట పాకిస్థాన్ 147 పరుగులు చేసి ఆల్ ఔట్ కాగా.. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి అనగా చేధించింది ఇండియా. ఇలా చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ కు రేటింగ్స్ అనేవి భారీ రేంజ్ లో వచ్చాయి.

Advertisement

ఈ మ్యాచ్ యొక్క అధికారిక బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఎప్పుడు చూడని రేటింగ్స్ ఈ మ్యాచ్ కు వచ్చాయి. అలాగే ఓటీటీలో కూడా వ్యువర్స్ అధిక మొత్తంలో వచ్చారు. ఈ మ్యాచ్ కు నిన్న కోటి 30 లక్షల మంది లైవ్ లో చూసారు. హాట్ స్టార్ లో ఇంత మొత్తంలో వ్యువర్స్ రావడం ఇదే మొదటిసారి. ఇంతకముందు గత ఏడాది జరిగిన ఇండియా, పాక్ మ్యాచ్ అలాగే ఐపీఎల్ 2022 ఫైనల్స్ ను అధికంగా కోటి 20 లక్షల మంది చూడగా.. ఈ మ్యాచ్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఇవి కూడా చదవండి :

పరుగులు చేసిన కోహ్లీకి తప్పని విమర్శలు..!

జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading