Home » ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

by Azhar
Ad

ఈ నెల 27 నుండి పిప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీం ఇండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక గత కొన్ని రోజులుగా రెస్ట్ లో ఉంటూ ఈ టోర్నీలో ఆడుతాడా లేదా అనే అనుమానాల మధ్య ఉన్న విరాట్ కోహ్లీ పేరు కూడా జట్టులో ఉంది.

Advertisement

అయితే వికెట్ కీపర్ గా పంత్ తో పాటుగా ప్రస్తుతం మంచి ఫినిషర్ గా ఉన్న దినేష్ కార్తీక్ ను ఎంపిక చేసారు. అలాగే టీ20 ల్లో టాప్ బ్యాటర్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ తో పాటుగా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, జడేజాకు చోటు లభించింది. అలాగే భారత పేస్ విభాగానికి లీడర్ గా భువీ ఉంటె.. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ అతనికి తోడుగా ఉన్నారు. అశ్విన్ తో పాటుగా చాహల్, బిష్ణోయ్ స్పిన్నర్లు గా ఉన్నారు.

Advertisement

ఆసియా కప్ 2022 టీం ఇండియా : రోహిత్ శర్మ (C), కెఎల్ రాహుల్ (VC), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, ఆర్ పంత్ (WK), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, వై చాహల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ , అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.

స్టాండ్ బై : శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ కు బుమ్రా కూడా మిస్..!

గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

Visitors Are Also Reading