Home » పాపమని పనిలో పెట్టుకుంటే..తన భార్యపై కన్నేసాడు.. బెడ్ పై అలా చూసి..!!

పాపమని పనిలో పెట్టుకుంటే..తన భార్యపై కన్నేసాడు.. బెడ్ పై అలా చూసి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad
 ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు అనేవి  చాలామంది జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. ఆలోచన చేయకుండా చేసే పనులు  ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మనిషిని నమ్మడమే శాపంగా మారుతుంది.  అలా ఒక వ్యక్తి పనిలేదు పాపమని ఒక యువకుడికి పని ఇస్తే  తన భార్యపై కన్నేసి  అలాంటి పని చేస్తూ దొరికిపోయాడు.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. మవిశాఖ జిల్లా గాజువాక చెందిన పతివాడ గౌరీ సాయి అనే వ్యక్తి  ఎంవిపి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి  మారికవలస లో నివాసం ఉంటున్నాడు. అతడికి గుర్రాలు ఉన్నాయి.  ఆర్కే బీచ్ లో పర్యాటకుల నుంచి డబ్బులు తీసుకుని ఆ గుర్రాలను  తిప్పుతుంటాడు. అదే ప్రాంతానికి చెందిన రిక్త జగదీశ్వర్ రావు అలియాస్ శివ  అనే యువకుడ్ని చేర తీసిన గౌరీ సాయి  పనిలో పెట్టుకున్నాడు.
  అయితే గౌరీ సాయి ఓ కేసు విషయమై కొన్నాళ్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  ఈ సమయంలోనే గుర్రాల పర్యవేక్షణ నగదు లావాదేవీలను తన భార్య ఆధ్వర్యంలో శివకు అప్పగించాడు.  ఈ సందర్భంలోనే శివ తన భార్యతో చీకటి సంబంధం పెట్టుకున్నాడు.  ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు వీరు ఎంజాయ్ చేస్తూ వచ్చారు.  గౌరీ సాయి జైలు నుంచి వచ్చిన తర్వాత శివకు బయట మంచి పేరు రావడమే కాకుండా,  తన భార్యతో చాలా చనువుగా ఉండడం చూశాడు. తన భార్య కూడా గౌరీ సాయిని  కాస్త దూరం పెడుతూ వచ్చింది.  దీంతో అనుమానపడ్డ గౌరీ సాయి వారిపై కన్నేశాడు. ఓసారి ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్న సమయంలో  చూశాడు.
ఎలాగైనా శివను అంతం చేయాలని భావించి ఓ రోజు శివను శ్రీకాకుళం జిల్లాకు తీసుకెళ్లాడు.  అక్కడ ముందుగానే గోతి తీయించి, గౌరీ సాయి తన స్నేహితులను రెడీగా ఉంచాడు.  అక్కడికి వెళ్లిన తర్వాత మందు గంజాయి బాగా తాగించి శివ పై దాడి చేసి  అదే గోతిలో పూడ్చిపెట్టారు.  మార్చి 4న ఈ ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తన కుమారుడు నెల రోజుల నుంచి  కనిపించడం లేదని శివ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులకు గౌరీసాయి మీద అనుమానం వచ్చి వారి స్టైల్ లో  విచారించారు. దీంతో జరిగిన విషయాన్నంతా  చెప్పేశాడు.

Advertisement

Visitors Are Also Reading