Home » ఆర్సీబీకి కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమాని పోస్ట్.. హర్భజన్ కౌంటర్..!

ఆర్సీబీకి కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమాని పోస్ట్.. హర్భజన్ కౌంటర్..!

by Anji
Ad

సాధారణంగా ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ కి కేవలం భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశ ఆటగాళ్లు అందరూ కలిసి ఆడటంతో ఈ గేమ్ కి చాలా క్రేజ్ ఉంటుంది.  ముఖ్యంగా ఐపీఎల్ కి  ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక దాయాది పాకిస్థాన్ లో  అయితే.. ఈ మెగా టోర్నీని ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉంటుంది.

Advertisement

అక్కడి లీగ్ లతో సమానంగా ఈ టోర్నీని  చూస్తుంటారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో బయటపెట్టాడు. పాక్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడితే చూడాలనుందని పేర్కొన్నాడు. ఆర్సీబీకి విరాట్ కోహ్లితో పాటు పాక్ క్రికెటర్  బాబర్ అజామ్ ఆడితే చూడాలని ఉందని అతడు ఎక్స్ లో పోస్టు పెట్టాడు. అంతటితో ఆగలేదు ఆ అభిమాని. షాహిన్ అఫ్రిదీ, బుమ్రా కలిసి ముంబయి ఇండియన్స్ కి ఆడాలని.. ధోనీ సీఎస్కే జట్టులో రిజ్వాన్ ఉంటే బాగుంటుందని ఇలా తన చిట్టాను వివరించాడు.

Advertisement

 

ఇది భారత్, పాక్ క్రికెట్ అభిమానుల కల అంటూ ఆయా జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలను పంచుకున్నాడు. దీనిపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. “భారతీయులెవరికీ అలాంటి కల లేదు. మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్” అంటూ పాక్ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తొలి సీజన్ లో పాక్ ప్లేయర్లు కూడా ఐపీఎల్లో ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాయాది దేశం ఆటగాళ్లపై ఈ టోర్నీలో ఆడకుండా నిషేధం విధించారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.  భారత్ లో ఎన్నికలు ఉండటంతో ఫైనల్ అనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ఫైనల్ తేదీ ప్రకటించే అవకాశముంది.

Also Read :   రోహిత్ వల్లే బుమ్రా, హార్దిక్ టీం లోకి.. పార్థివ్ పటేల్ సంచలన కామెంట్స్..!

Visitors Are Also Reading