Home » సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్..!

సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

మెగా హీరో వరుణ్ తేజ్  హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరు జంటగా స్టార్ డెరెక్టర్ శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ ఏ స్థాయిలో ప్రేక్షకాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరమే  లేదు. అయితే ఈ సూపర్ హిట్ జోడీ రిపీట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా దీనిపై వరుణ్ తేజ్ మాత్రం తమ కాంబోలో మూవీ ఇప్పట్లే లేనట్లేనంటూ షాక్ ఇచ్చాడు.

Advertisement

రీసెంట్ గా ఓ ఇంటర్వూలో పాల్గొన్న వరుణ్ దీని గురించి మాట్లాడుతూ.. మళ్లీ తాము కలిసి నటించకపోవడానికి బలమైన కారణం ఉందని చెప్పారు. ‘మా కలయికలో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఇద్దరం కథ కూడా విన్నాం. కానీ ఈసారి చేసే సినిమా ‘ఫిదా’కు మించి ఉండాలని అనుకున్నాం. లేకపోతే అసలే చేయకూడదని ఫిక్స్ అయ్యాం. అందుకే మా కాంబోలో మూవీ రావట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

గతంలో తాను నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఓ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం వచ్చినా కథ నచ్చకపోవడంతో చేయలేదన్నారు. నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌లతో కలిసి ఓ మూవీలో నటించాలనుందంటూ మనసులో మాట బయటపెట్టారు. ఇండస్ట్రీలో నితిన్‌ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఓ సినిమా హిట్‌ అయినా ప్లాఫ్‌ అయినా తదుపరి చిత్రానికి ఒకేలా కష్టపడతానని, ప్రతీ మూవీ ఫలితాన్ని విశ్లేషించుకుంటానని వరుణ్ చెప్పుకొచ్చారు. ఇక వరుణ్‌ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’  మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read :  క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ జీవితంలో ఇంత‌టి విషాద‌ముందా..!

 

Visitors Are Also Reading