Home » జగన్ పై హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోండి!

జగన్ పై హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోండి!

by Bunty
Ad

జబర్దస్త్ షో తో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ యంగ్ కమెడియన్ సుదీర్ఘకాలంగా తనదైన కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు. ఇక అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సినీ పరిశ్రమలో కూడా దూసుకెళ్తున్నాడు. అయితే హైపర్ ఆది సినిమాలే కాదు, జన పార్టీలోను కొనసాగుతున్నారు.

Advertisement

ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి హాజరైన హైపర్ ఆది వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోడంటూ జగన్ సర్కారుపై హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో హైపర్ ఆది మాట్లాడుతూ, మొదటిసారి నేను ప్రజలకు మంచి చేయాలి అని ఆలోచనతో ఉన్న నాయకులను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడికి ఎంతోమంది యువత రావడంతో ఇప్పటికే ప్రత్యర్థి రాజకీయ నాయకులు కుళ్ళుకొని ఉంటారు.

Advertisement

 

వారికోసం ఒక సెకండ్ మౌనం పాటిస్తే సరిపోతుంది. ఇక ఈ ప్రపంచంలో ఎంత కష్టపడినా ఈ పదవి అయినా దక్కుతుంది కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి ఎవరికి అంత ఈజీగా రాదు. ఆయన స్థాయి వేరు, స్థానం వేరు అని హైపర్ ఆది అన్నాడు. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా అభ్యర్థిగా మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది బిర్యాని ప్యాకెట్ల కోసం, మందు కోసం రాలేదు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చారు. ఆయన మంచితనం చూసి వచ్చారు. అని హైపర్ ఆది గొప్పగా వివరణ ఇచ్చాడు.

READ ALSO : శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన రాకెట్ రాఘవ !

Visitors Are Also Reading