Home » హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​

హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​

by Anji
Ad

సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌రోనా మ‌హ‌మ్మారి వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను.

keerthy suresh

Advertisement

Advertisement

ఇటీవల నన్ను కలిసిన వారు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా కోరారు. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని, జాగ్రత్తగా ఉన్నా కూడా నాకు కరోనా సంభ‌వించింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ వలన తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు. త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్‌లోకి వ‌స్తాను అని చెప్పింది. ‘మహానటి’ చిత్రంతో అందరికీ చేరువైన కీర్తి ప్రస్తుతం మ‌హేష్ సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది.

Visitors Are Also Reading