Home » గుజరాత్ టైటాన్స్ తరపున పోలార్డ్…?

గుజరాత్ టైటాన్స్ తరపున పోలార్డ్…?

by Azhar

ఐపీఎల్ 2022 లో అద్భుతంగా రాణిస్తున్న జట్టు గుజరాత్ టైటాన్స్. ఈ ఏడాదే ఐపీఎల్ లోకి వచ్చిన ఈ జట్టు ఇప్పటికే 16 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. అలాగే ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా ఆడుతున్న జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లలో వరుసగా 8 ఓడిపోయిన ముంబై… ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది.

అయితే ఈ రోజు ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్యే మ్యాచ్ జరగబోతుంది. ఇక తన ఐపీఎల్ కెరియర్ ను ముంబైతో ప్రారంభించిన పాండ్య ఈ రోజు మొదటిసారి ఆ జట్టుకు విరుద్ధంగా ఆడుతున్నాడు. దాంతో ఈ మ్యాచ్ గురించి పాండ్య మాట్లాడుతూ. ముంబైతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ జట్టులో ఉన్నప్పుడే నా లైఫ్ మారిపోయింది అని చెప్పుకోచ్చాడు.

అలాగే ఆ జట్టులో తన ఫ్రెండ్ అయిన పోలార్డ్.. తన గుజరాత్ జట్టు తపునా ఆడాలని.. తన కొరక అని… కానీ అది ఎప్పటికి నెరవేరదని కూడా పాండ్యనే చెప్పాడు. ఎందుకంటే… ముంబై ఎప్పటికి పోలార్డ్ ను వదులుకోదు అనే విషయం నాకు తెలుసు అని పాండ్య అన్నాడు. ఇక ఈ ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు పోలార్డ్ ను ముంబై 6 కోట్లతో రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ బిగ్ గాయ్ మాత్రం అనుకున్న విధంగా రాణించలేకపోతున్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?

ధోని మాటలకు అర్ధం అదే..!

Visitors Are Also Reading