Home » క్యాష్‌ ఆన్‌ డెలివరీ తో.. నయా మోసం..!

క్యాష్‌ ఆన్‌ డెలివరీ తో.. నయా మోసం..!

by Sravya

ఈరోజుల్లో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది వరకు జేబుదొంగలు ఉంటే ఇప్పుడు మాత్రం టెక్నాలజీని ఉపయోగిస్తూ ఇతరుల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఈ కామర్స్ కంపెనీల నుండి డేటా చోరీ చేసే వినియోగదారులకి నకిలీ వస్తువులని అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి తాజాగా బెంగళూరు పోలీసులు సైబర్ మోసగాళ్ల కొత్త మోసాలని ఛేదించారు. దాదాపు 21 మందితో కూడిన ముఠాని అరెస్ట్ చేశారు ఇక వివరాలను చూసేద్దాం.

బడా ఈ కామర్స్‌ కంపెనీలు కొన్ని వస్తువులను అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు విక్రయిస్తుంటాయి. అయితే ఈ డేటాని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదు. కానీ ఆయా కంపెనీల్లో పనిచేసే కొందరు మోసాలు చేస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు ని సైబర్ మోసగాళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని డేటాను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఈ-కామర్స్‌ కంపెనీల నుంచి సేకరించిన డేటాతో క్యాష్‌ ఆన్‌ డెలివరీ కి సంబంధించి డేటా ని తీసుకుంటున్నారు.

వాళ్ళు ఆర్డర్‌ చేసిన వాటిని కాకుండా నకిలీ వస్తువులను డెలివరీ చేసి డబ్బులని దోచేసుకుంటున్నారు. కొరియర్‌ సబ్‌-షిప్పింగ్‌ కంపెనీ సమాచారం అలానే నిందితులు కస్టమర్లకు పంపిన నకిలీ షిప్‌మెంట్‌ డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు. కేవైసీ, బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని పట్టుకుంది దర్యాప్తు చేయగా 21 మందితో కూడిన ముఠా ఉన్నట్టు తెలిసింది. అరెస్ట్ చేసారు. రూ. 26.95 లక్షలు నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు ని తీసుకున్నారు.

Also read:

Visitors Are Also Reading