Home » వరుస గెలుపులతో ఉన్న ముంబై షాక్.. ఆటగాడికి మళ్ళీ గాయం..!

వరుస గెలుపులతో ఉన్న ముంబై షాక్.. ఆటగాడికి మళ్ళీ గాయం..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏం బాగాలేదు అనే విషయం తెలిసిందే. ఈరోజు ముంబై జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ముమాబీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ మళ్ళీ గాయం బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మనే వెల్లండించాడు.

Advertisement

ఈరోజు మ్యాచ్ టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. సూర్య కుమార్ యాదవ్ గాయం వల్ల తప్పుకున్నాడు. అందుకే అతని స్థానంలో రమన్‌దీప్ సింగ్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే సూర్యకు కండరాల వద్ద గాయం కావడంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరం అయినట్లు తెలుస్తుంది. అందువల్ల అతని స్థానంలో ముంబై జట్టు ఎవరిని జట్టులోకి తీసుకుంటుంది అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది.

Advertisement

అయితే సూర్య కుమార్ ఈ సీజన్ ఆరంభంలో కూడా గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్ లకు దూరం అయ్యాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి వరుసాగా రెండు మ్యాచ్ లలో అర్ధశతకాలు సాధించాడు. ఇక వరుసగా 8 మ్యాచ్ లలో ఒదిన ముంబై తర్వాత రేడు మ్యాచ్ లలో గెలిచిచింది. అయిన ఇప్పుడు సూర్య కుమార్ గాయంతో దూరం కావడం జట్టుకు పెద్ద నష్టమే అని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

చెన్నై గెలుస్తున్నా.. ఏడుస్తున్న అభిమానులు…!

ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?

Visitors Are Also Reading