Home » బోణీ క‌పూర్ శ్రీదేవి మ‌ధ్య గొడ‌వ‌లు..! అతిలోక సుంద‌రి తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్లే ప్రాణాలు కోల్పోయిందా.?

బోణీ క‌పూర్ శ్రీదేవి మ‌ధ్య గొడ‌వ‌లు..! అతిలోక సుంద‌రి తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్లే ప్రాణాలు కోల్పోయిందా.?

by AJAY
Ad

అతిలోకసుందరి శ్రీదేవి అంటే పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని చాలామంది వస్తుంటారు వెళుతుంటారు. కానీ అది కొద్ది మంది మాత్రమే తరతరాలు గుర్తుండిపోయే క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో శ్రీదేవి కూడా ఒకరు. శ్రీదేవి బాలనటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ జోడి కట్టింది.

Advertisement

కేవలం టాలీవుడ్ తో సరిపెట్టుకోకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటింది. బాలీవుడ్ లోనూ శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా రానించింది. ఇక శ్రీదేవి హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలోనే నిర్మాత బోనీ క‌పూర్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే బోణీకపూర్ కు పెళ్లై భార్య ఉండగా ఆమెకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు.

Advertisement

ఇక బోణీకపూర్ శ్రీదేవి లకు ఇద్దరు కుమార్తెలు జన్మించిన సంగతి తెలిసిందే. కాగా శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా 2018లో గుండెపోటుతో మరణించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వి క‌పూర్ తన తల్లి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి బోణికపూర్ కు సిగరెట్లు తాగే అలవాటు అధికంగా ఉండేదని చెప్పింది.

దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని చెప్పింది. బోణి కపూర్ సిగరెట్లు మానేయాలని లేదంటే తాను మాసం తిన‌ను అని శ్రీదేవి శ‌ప‌తం చేసిందని..అయిన‌ప్ప‌టికీ తన తండ్రి సిగ‌రెట్ లు మానేయ‌లేద‌ని చెప్పింది. డాక్టర్లు సైతం చాలా వీక్ అయ్యారని కచ్చితంగా మాంసం తినాలి అని హెచ్చరించినా శ్రీదేవి వినలేదని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీదేవి గుండెపోటుతో మరణించిందని పేర్కొంది. తన తల్లి మరణం తర్వాత నాన్న సిగరెట్లు మానేస్తానని అన్నారని పేర్కొంది.

Visitors Are Also Reading