Home » తులసి లేని నైవేద్యాన్ని మహా విష్ణువు ఎందుకు స్వీకరించడో మీకు తెలుసా ?

తులసి లేని నైవేద్యాన్ని మహా విష్ణువు ఎందుకు స్వీకరించడో మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా హిందువులు ప్రతి ఏడాది కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు తులసికి వివాహం అత్యంత వైభవంగా జరుపుతుంటారు.  కొందరు సిల్క్ ద్వాదశి అంటూ.. కార్తీక ద్వాదశి రోజున కూడా తులసి వివాహాన్ని జరుపుతారు. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. శ్రీ మహావిష్ణువు తులసి లేని నైవేద్యాన్ని అస్సలు స్వీకరించడు. పురాణాల ప్రకారం.. తులసి విష్ణువు కంటే ముందు బృందగా రాక్షస వంశానికి చెందిన అసురుడిని వివాహం చేసుకుంది. అంతేకాదు.. బృంద కూడా రాక్షస వంశంలో పుట్టింది. రాక్షస వంశంలో పుట్టిన తులసి మహావిష్ణువుకి ఎందుకు చాలా ప్రీతిపాత్రమైనది? తులసి విష్ణువుకు మధ్య ఉన్న బంధం గురించి పురాణాల కథనం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

తులసి పూర్వ జన్మలో బృంద అనే యువతి. రాక్షస వంశంలో జన్మించిందని నమ్ముతారు. అయినప్పటికీ బృంద చిన్నతనం నుంచి విష్ణు భక్తురాలు. ఆమె పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత రాక్షస వంశానికి చెందిన రాక్షస రాజు జలంధరుడిని వివాహం చేసుకుంది. జలంధరుడనే రాక్షసుడు సముద్రం నుంచి పుట్టాడు. బృంద చాలా సద్గుణాలు కలిగిన స్త్రీ. భర్తను దైవంగా భావించి పూజించేది. ఒకసారి  దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది. అప్పుడు బృంద తన భర్త జలంధరుడితో మీరు యుద్ధానికి వెళుతున్నారు. యుద్ధంలో ఉన్నంతవరకు యుద్ధంలో మీరు విజయం సాధించాలని కోరుతూ పూజ చేస్తాను అని చెప్పింది. యుద్ధం నుంచి తన భర్త తిరిగి వచ్చేటంత వరకు పూజ సంకల్పాన్ని విడవనని చెప్పింది. 

Advertisement

భార్య బృందం చెప్పిన తర్వాత జలంధరుడు యుద్ధానికి వెళ్ళాడు. బృంద ఉపవాస దీక్ష చేపట్టి పూజ చేయడం మొదలుపెట్టింది. బృంద పూజ ప్రభావం వల్ల దేవతలు కూడా జలంధరుని ఓడించలేక పోయారు. దేవతలు ఓడిపోవడం ప్రారంభించిన తర్వాత దేవతలందరూ కలిసి విష్ణువు వద్దకు వచ్చారు. తమను ఈ ప్రమాదం నుంచి కాపాడమంటూ ప్రార్థించారు. బృంద గొప్ప భక్తురాలు. తాను ఆమెను మోసం చేయలేను అని విష్ణువు సమాధానమిచ్చాడు. అయినప్పటికీ తమ గెలుపు కోసం పరిష్కారం దయచేసి చెప్పమని విష్ణువుని వేడుకున్నారు. దీంతో శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపాన్ని ధరించి బృంద ఉన్న రాజభవనానికి చేరుకున్నాడు. బృంద తన భర్తను చూడగానే వెంటనే పూజ చేయడం విరమించి భర్త పాదాలను తాకింది. దీంతో బృంద సంకల్పం భగ్నమైంది. యుద్ధంలో దేవతలు జలంధరుని చంపి తల నరికారు. తెగిన జలంధరుని శిరస్సు రాజభవనంలో బృంద ఉన్న చోట పడింది. దీంతో బృంద జలంధరుని రూపం దాల్చిన స్వామిని ఆశ్చర్యంగా చూసింది.

శ్రీ మహా విష్ణువు తన భక్తురాలైన బృందతో అస్సలు ఏం మాట్లాడలేకపోయాడు. బృందకి కోపం వచ్చి విష్ణువును.. రాయిగా మార్చమని శపించింది. దీంతో విష్ణువు వెంటనే రాయిగా మారిపోయాడు. దేవుళ్ళందరిలో కాస్త అలజడి రేగింది. దేవతలందరూ బృందను ప్రార్థించిన తర్వాత.. బృంద తన శాపాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత బృంద తన భర్త శిరస్సుతో కలిసి సతిసహగమనం చేసింది. బృంద బూడిద నుంచి ఒక మొక్క ఉద్భవించింది. అప్పుడు విష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు. తాను రాతి రూపంలో శాలిగ్రామం పేరుతో ఉంటానని.. శాలిగ్రామం పేరుతో తులసితో పాటు పూజించబడతానని వరం ఇచ్చాడు బృందకు. అంతేకాదు.. తులసి లేని నైవేద్యాన్ని తాను స్వీకరించనని విష్ణువు చెప్పాడు. అప్పటి నుంచి తులసిని పూజించడం ప్రారంభించారు.  కార్తీక మాసంలో తులసి మాతకు శాలిగ్రామానికి వివాహం చేస్తారు. అలాగే దేవ ఉథాని ఏకాదశి రోజున తులసి వివాహాన్ని జరిపిస్తారు. 

 

Visitors Are Also Reading