టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో దుష్యంతుడి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ దేవ్ మోహన్ కాదని తెలిపారు. ఈ పాత్ర కోసం తొలుత దుల్కర్ సల్మాన్ ని తీసుకోవాలనుకున్నారట.
Also Read : రామ్ చరణ్ గురించి ఆ రోజు శ్రీహరి చెబితే నమ్మలేదు ! ఈరోజే అక్షరాలా నిజమయ్యిందా ?
కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం సినిమా కోసం సంతకం చేయడంతో డేట్ క్లాష్ అవుతాయని భావించి సినిమాకి నో చెప్పారట. ఇక తెలుగు హీరోలను ఎంపిక చేయపోవడానికి కూడా ఓ కారణం ఉందట. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు రాలేదట. దీంతో మలయాళి హీరో దేవ్ మోహన్ ని తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.
Also Read : ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !
శాకుంతలం సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ వంటి భాషల్లో విడుదల చేయనున్నారు దిల్ రాజు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన శాకుంతలం ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 14 వరకు ఎదురుచూడాల్సిందే.
Also Read : సెలబ్రెటీ బ్రాండ్ నంబర్ 1 స్థానంలో రణ్ వీర్ సింగ్..మరి టాలీవుడ్ నుండి ఎవరంటే..?