సెలబ్రెటీలు సినిమాల కంటే సెలబ్రెటీ బ్రాండ్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తుంటారు. సినిమా అయినా క్రికెట్ అయినా చాలా కష్టపడాలి కానీ యాడ్ అంటే పెద్దగా కష్టం లేకుండా కోట్ల రూపాయలు వస్తాయి. అయితే ఇండియాలో సెలబ్రెటీ బ్రాండ్ గా విరాట్ కోహ్లీ నంబర్ 1 స్థానంలో ఉండేవాడు. కానీ 2022 ఏడాదికి గానూ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కోహ్లీని దాటేసి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు.
also read : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?
Advertisement
Advertisement
రణ్ వీర్ సింగ్ విలువ ప్రస్తుతం రూ.1500 కోట్లకు చేరింది. దాంతో ఆయన నంబర్ వన్ స్థానానికి చేరగా విరాట్ కోహ్లీ విలువ 1450 కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఇక వరుసగా బాలీవుడ్ సెలబ్రెటీలు అక్షయ్ కుమార్ దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్ లు ఉన్నారు. అంతే కాకుండా మన టాలీవుడ్ నుండి టాప్ 25 జాబితాలో అల్లు అర్జున్ సైతం చోటు దక్కించుకున్నారు.
అల్లు అర్జున్ సెలబ్రెటీ బ్రాండ్ విలువ ప్రస్తుతం రూ. 257 కోట్లుగా ఉంది. అంతే కాకుండా ఆ లిస్ట్ లో రష్మిక మందన కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఈ బ్యూటీ విలువ రూ. 207 కోట్లకు చేరుకుంది. ఇక టాప్ 25 లో ఉన్నవాళ్లంతా బాలీవుడ్ సెలబ్రెటీలు మరియు క్రిడాకారులే. అంతే కాకుండా పీవీ సింధు కూడా టాప్ 25 లో ఉండటం విశేషం.
ALSO READ :Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?