Home » హీరో ప్రశాంత్ సినిమా కెరీర్ నాశనం కావటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

హీరో ప్రశాంత్ సినిమా కెరీర్ నాశనం కావటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

by Mounika
Ad

సీనియర్‌ హీరో ప్రశాంత్‌ గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకలేకపోవచ్చు. కానీ దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆయన సౌత్‌లో టాప్‌ హీరోగా రాణించాడు. ప్రశాంత్ తొలిముద్దు, జీన్స్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు  కూడా సుపరిచితులే. ఈయన ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించేవారు.  చిన్న వయసులోనే  హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక హీరో ప్రశాంత్‌ తండ్రి త్యాగరాజన్‌ దర్శకుడు మరియు నటుడు కూడా.

Advertisement

ఇక ప్రశాంత్‌ 17వ ఏటనే వైగాసి పోరంతచ్చు అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ప్రశాంత్‌ తన కెరీర్‌లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో జీన్స్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జీన్స్‌ చిత్రం ప్రశాంత్‌ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పటిలో అజిత్‌, విజయ్‌ వంటి హీరోలకు ధీటుగా కెరీర్‌లో  వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ప్రశాంత్‌ కెరీర్ భార్యతో వివాదాల కారణంగా ఒకసారిగా పాతాళానికి పడిపోయింది.

 వైవాహిక జీవితంలో  సమస్యల కారణంగా ప్రశాంత్‌ సినిమా కెరీర్‌పై ప్రభావం చూపాయి. 2005లో  ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో ప్రశాంత్‌కు వివాహం జరిగింది. మూడేళ్ల పాటు బాగానే ఉన్న ఈ జంట  ఒక కుమారుడు  జన్మించిన తర్వాత వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. వివాహం అయిన మూడేళ్లకే ప్రశాంత్ మరియు గృహలక్ష్మి విడిపోయారు. ప్రశాంత్‌ నుంచి విడిపోయినా గృహలక్ష్మి.. పుట్టింటికి చేరుకున్న తర్వాత ఒక పాపకు జన్మనిచ్చింది. బిడ్డను చూసేందుకు ప్రశాంత్‌ గృహలక్ష్మి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడంతో..  వారు బిడ్డను చూసేందుకు ప్రశాంతని  అనుమతించలేదు. భార్యతో కలిసి ఉండేందుకు ప్రశాంత్‌ ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేవి విఫలమయ్యాయి. ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలే జరిగాయి.

Advertisement

 భార్యాభర్తల మధ్య  గొడవలు జరుగుతున్న సమయంలోనే  నారాయణన్‌ అనే మరో వ్యక్తి.. వారి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్‌ కన్నా ముందే నారాయణన్‌  గృహలక్ష్మిని వివాహం చేసుకున్నాను అంటూ ఆరోపణలు చేశాడు. 1998లోనే గృహలక్ష్మి తనను వివాహం చేసుకుందని నారాయణన్‌ వెల్లడించాడు. నారాయణన్‌ రాకతో.. ప్రశాంత్‌, గృహలక్ష్మిల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయింది. ఇక ప్రశాంత్‌ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కుమార్తెను తనకు అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. అయితే కోర్టు కేవలం విడాకులు మాత్రమే మంజూరు చేసి, బిడ్డను అతడికి అప్పగించలేదు. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, వివాదాలు ప్రశాంత్‌  స్టార్ ఇమేజ్‌ను భారీగా దెబ్బ తీయడంతో, కొన్నాళ్లు వరకు ఆయన సినిమాలకు దూరంగా ఉండటం.. ఈలోపు అజిత్‌, విజయ్‌ లాంటి స్టార్లు సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగారని కాంతరాజ్‌ ఓ ఇంటర్వ్యూ ద్వారా  చెప్పుకొచ్చారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

అన్ని హిట్లే ఉన్న కెరీర్ లో ఆ ఒక్క సినిమా రాజమౌళిని ఇంత బాధపెట్టిందా? అదేంటంటే?

Bhagavanth Kesari: హరికృష్ణ నటించిన ఆ మూవీ ని “భగవంత్ కేసరి” గా రీమేక్ చేస్తున్నారా?

Visitors Are Also Reading