Home » వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

by Anji

సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  నటుడిగానే కాదు.. గొప్ప రాజకీయ నాయకుడిగా తెలుగువారి గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు అన్న ఎన్టీఆర్. ఇప్పటికీ కూడా చాలా మంది హీరోలు సీనియర్ ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ముఖ్యంగా ఆయన నటనను కొనియాడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ చలనచిత్ర వైభవం భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకం అని అంటుంటారు. అలాంటి గొప్ప నటుడు, నాయకుడు తన చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు. అందులో కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు ఎన్టీఆర్. కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి సీఎంగా ఎన్నో అభివృద్ది పథకాలకు పునాది వేసారు. ఇప్పటికీ కూడా కొన్ని  ఎన్టీఆర్ పకథాలను కొనసాగిస్తున్నారంటే మనం ఇక అర్థం చేసుకోవచ్చు. గొప్ప జీవితాన్ని అనుభవించినటువంటి ఎన్టీఆర్ చివరి రోజుల్లో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వైస్రాయ్ ఘటన ఆయనను తీవ్రంగా కలిచి వేసింది. ఈ ఘటన తరువాత ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనే విషయం గురించి ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. 

“సాధారణంగా నాన్న ఎంత శాంతి పరులో అంతే ఆగ్రహంతో ఉంటారు. ఆయన మనస్సు కష్టమైన పని ఏది చేసినా తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తారు. వైస్రాయ్ సంఘటన తరువాత నాన్న ఎంతో ఆందోళన, ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో తనకు వెన్నుపోటు పొడిచిన వారిలో తన కుటుంబం కూడా ఉందని.. చాలా బాధపడ్డారు. నాన్నను కలిసి ఓ దార్చేందుకు ఆ సమయంలో ఎవ్వరూ ధైర్యం చేసి వెళ్లలేకపోయారు.  ఆ సమయంలో నాన్నను కలవాలనుకున్నాను. నన్ను తిట్టినా.. కొట్టినా పర్వాలేదు.. కానీ కచ్చితంగా నాన్న ఇంటికి వెళ్లి కలవాలని పట్టుబట్టాను. ఆ సమయంలో తమ్ముడు బాలకృష్ణ వారించాడు. నాన్న ఏమైనా అంటే నువ్వు తట్టుకోలేవు. అవమానాన్ని భరించలేక ఏడుస్తావు అని చెప్పాడు.

 

అయినప్పటికీ తమ్ముడు బాలకృష్ణ ని ఎలాగో అలాగా  ఒప్పించి నాన్న ఇంటికి వెళ్లాను. బాలకృష్ణ బయట కూర్చొని ఉండగా.. నేను నాన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాను. అక్కడికీ వెళ్లగానే నన్ను చూసి రండి..కూర్చొండమ్మా అంటూ ఓ ముసలివాడిని గద్దె దించడానికి కుటుంబం మొత్తం ఏకం కావాలా..?  అని ఆవేదనగా మాట్లాడారు. అది ఆయన గొప్పతనం.. నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు నాన్న. నన్ను నాన్న కొట్టినా.. తిట్టినా బాధపడేదానిని కాదు.. ఆ రోజు నాన్న అన్న మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి” అని పురంధేశ్వరి పేర్కొన్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాల‌య్యను కాదనీ.. బ్రాహ్మ‌ణీ ఏం చేస్తుందో తెలిస్తే షాక‌వుతారు ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

 

Visitors Are Also Reading