Home » కాంతారావు గురించి కూతురు సుశీల ఏమన్నారో తెలుసా ?

కాంతారావు గురించి కూతురు సుశీల ఏమన్నారో తెలుసా ?

by Anji

తెలంగాణ తొలి బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నటుడు కాంతారావు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.  సూర్యపేట జిల్లా గుడిబండ గ్రామానికి చెందిన కాంతారావు అన్ని జానర్ల సినిమాల్లో నటించి సక్సెస్ సొంతం చేసుకున్నారు. కాంతారావుకి ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన వారసులు మాత్రం ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారనే ఇటీవల కాంతారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ తెలిసిందే. 

ముఖ్యంగా కాంతారావు వారసులకు సంబంధించిన ఫోటోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాంతారావు ఆస్తుల గురించి ఆయన కూతురు విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాంతారావు కూతురు సుశీల మాట్లాడుతూ.. హీరోయిన్ల పిచ్చి వల్లనే నాన్న డబ్బులు పోగొట్టుకున్నాడని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించారు. మా నాన్నకి అమ్మాయిల పిచ్చి అస్సలు లేదని సుశీల కామెంట్లు చేశారు. ఆయనకు తెలిసిన ప్రపంచం సినీ ప్రపంచం అని పేర్కొన్నారు. నాన్న సరైన విధంగా పెట్టుబడులు పెట్టలేదని సుశీల తెలిపారు. రెండు పెగ్గులు మద్యం తీసుకునేవారని ఆమె చెప్పుకొచ్చారు.  

Also Read :  థమన్ మావా మళ్ళీ దొరికిపోయాడా ? వీరసింహారెడ్డి మూవీ నుండి ‘జై బాలయ్య పాట‌ అక్కడ నుంచి కాపీ ?

Manam News

ముఖ్యంగా నాన్నకు క్యాన్సర్ అని మాకు తెలిసినా ఆయనకు చెప్పలేదని తెలిపారు. ఆయన బర్త్ డే ఉంటే ఫ్రెండ్స్ ను కచ్చితంగా పిలిచే వారని చెప్పుకొచ్చారు. నాన్న షుగర్ ఫేషెంట్ అని సుశీల వివరించారు. అపోలో ఆసుపత్రిలో స్కాన్ చేయించిన సమయంలో నాన్నకు క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.  సుశీల వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

.Also Read :  నాగశౌర్య భార్య ఆస్తి ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading