Home » ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ మూవీతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తోంది. చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ భోళా శంకర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తి కర విషయాలను మాట్లాడారు. ముఖ్యంగా రీమేక్ విషయంలో చాలా చర్చలు జరిగాయి. తొలుత ఆసక్తి చూపించలేదు. కానీ నిర్మాత, దర్శకుడు సినిమా రీమేక్ కోసం కథ చెప్పి మరీ మెగాస్టార్ ని ఒప్పించారు. 

Advertisement

అయితే ఈ చిత్రాన్ని దాదాపు ఏడు సంవత్సరాల కిందట ఏ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ సమయంలో స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. అంతేకాదు.. అధికారికంగా ప్రకటన కూడా చేశారు.  కానీ ఈ మూవీని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. మ ఇతర ప్రాజెక్ట్ లతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో వేదాళం మూవీ రీమేక్ చేయలేకపోయారు. వేదాళం కథతో ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడు.  భోళా శంకర్ మూవీ రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేసి తెలుగులో రూపొందించారు. గతంలో పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

ఈ రీమేక్ కి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి అయితేనే బాగుంటుందని చాలా మంది భావించారట. అందుకే చిరంజీవి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని కొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోళా శంకర్ మూవీని ఒకవేళ పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసి ఉంటే ఎలా ఉండేదో కదా అని ఇప్పుడు మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు డైరెక్టర్  మెహర్ రమేష్ ఇప్పటివరకు తెరకెక్కించిన  కంత్రి, బిల్లా, శక్తి వంటి సినిమాలు ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు.   ఆగస్టు 11న విడుదలయ్యే భోళా శంకర్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 చెన్నై, బెంగళూరులో రజినీ జైలర్ ఫీవర్.. ఆఫీస్ లకు సెలవు, ఫ్రీ టికెట్స్..!

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

Visitors Are Also Reading