Home » కేజీఎఫ్ ఫేం యశ్- రాధికల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా ? 

కేజీఎఫ్ ఫేం యశ్- రాధికల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా ? 

by Anji
Ad

కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కేజీఎఫ్ సినిమాతో ఎంతటి సంచలన విజయాలను నమోదు చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.  ఎలాంటి సినిమా  బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కన్నడ సినీ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగారు యశ్. ప్రధానంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. రాఖీభాయ్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. 

Advertisement

కేజీఎఫ్ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. నిర్మాతలకు కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇవాళ యశ్-రాధిక పండిట్ 6వ వివాహ వార్షికోత్సవం. యశ్ భార్య రాధిక కూడా ఒక నటినే. వీరిద్దరూ మొదటి సారిగా 2004లో నంద గోకుల అనే టీవీ సిరియల్ ద్వారా కలుసుకున్నారట. వీరిద్దరూ కూడా ఈ సీరియల్ ద్వారానే బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఆ తరువాత నాలుగేళ్లకు వీరిద్దరూ కలిసి మొగ్గిన మనసు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత డ్రామా అనే సినిమాలో కూడా కలిసి నటించారు. 

Advertisement

Also Read :  అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఇలా వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి పని చేయడం వల్ల వీరిద్ధరి మధ్య స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2016లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఇద్దరు ( ఒక కూతురు, కుమారుడు) సంతానం.ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గడుపుతుంటాడు యశ్. తాజాగా ఈ ఆరేళ్ల వివాహ జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది రాధిక. దీనికి సమాధానంగా రాధిక ఐ లవ్ యూ అంటూ తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు యశ్. మరోవైపు కేజీఎఫ్ 2 తరువాత ఇప్పటి వరకు తన తరువాత సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. శంకర్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read :  కాంతార, సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Visitors Are Also Reading