Home » కాంతార, సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

కాంతార, సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

by Bunty
Ad

రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వగా, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. “అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢనమ్మకానికి కారణం.

Advertisement

 

ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ అయితే ఒక కొత్త కథని చూడబోతున్నామని అనుభూతిని ఇచ్చింది. ఇక ‘విరూపాక్ష’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే కాంతార తరహా కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది. అదే సమయంలో కాంతార సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన అజనీష్ లోకేష్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని సమాచారం.

Advertisement

కొంత కాలం గ్యాప్ తర్వాత సాయితేజ్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో సాయితేజ్ ఖాతాలో మరో సక్సెస్ చేరడం గ్యారెంటీ అని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సినిమా సాయితేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్నమైన కథలకు ఓటేస్తుండడం గమనార్హం. నిర్మాత తో ఉన్న అనుబంధం వల్లే ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం బ్యానర్ తో పాటు సాయితేజ్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సాయితేజ్ తర్వాత ఆ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడనున్నాయి.

READ ALSO : Panchatantram Movie Review : ‘పంచతంత్రం’ రివ్యూ

Visitors Are Also Reading