Home » టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

by Anji
Ad

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయన నటించిన  బ్లాక్ బస్టర్ మూవీ ఏక్ థా టైగర్.ఈ మూవీ  ఇప్పటికే రెండు పార్ట్ లుగా విడుదల కాగా.. రెండు  మంచి హిట్ సాధించాయి. ఏక్ థా టైగర్ తో ప్రారంభం సీక్వెన్స్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తొలుత 2012లో విడుదల కాగా.. తర్వాత  పార్ట్ 2 2017లో “టైగర్ జిందా హై”  విడుదలైంది.   అప్పట్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ “రా” ఏజెంట్ గా కనిపించాడు.

Also Read :  ఆ దోషాల వల్ల వివాహం అవ్వడం లేదా.. ఈ గణపతిని పూజిస్తే చాలు..!!

Advertisement

ఇక ఇప్పుడు టైగర్ 3 సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా  నటించనున్నాడు. దీంతో సీక్వెన్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి.సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ సీక్వెన్స్ కోసం రూ.35 కోట్లతో భారీ సెట్‌ను రూపొందించనున్నారు. మే 8 నుంచి చిత్రీకరించాల్సిన యాక్షన్ సీక్వెన్స్ జైల్‌హౌస్ సీక్వెన్స్ అనే టాక్  ఇక్కడ పఠాన్ టైగర్‌కు అనుకూలంగా తిరిగి వస్తాడు, ఎందుకంటే ‘పఠాన్’లో గమ్మత్తైన పరిస్థితి నుంచి బయటపడటానికి పఠాన్ అతనికి సహాయం చేశాడు.

Advertisement

Also Read :   కృష్ణ తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోను అంటూ ANR ఎందుకు అన్నారు ?

Manam News

టైగర్ 3 కూడా అదే విధంగా ఉండబోతుందనడంలో సందేహం లేదు. ఇద్దరు దిగ్గజ నటీనటులు ‘టైగర్ 3’లో భారీ రేంజ్ లో  యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నారు.  ఈ చిత్రంలో షారుక్,సల్మాన్ ల ఫైట్ సీక్వెన్స్ కోసం  ఓ సెట్‌ను నిర్మించడానికి రూ. 35 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఇది సినిమాకి హైలెట్ కానుందట.  సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టైగర్ శత్రువుగా ఇమ్రాన్ హష్మీ నటించిన ‘టైగర్ 3’  ఈ  ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Also Read :  దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య గురించి మీకు తెలుసా ? సెట్ లోనే సెలబ్రేషన్స్..!

Visitors Are Also Reading