Home » డీజే టిల్లు సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా ?

డీజే టిల్లు సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుందో అసలు ఎవరు ఊహించలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న శనివారం బ్లాక్ బస్టర్ హిట్ అయింది డీజే టిల్లు. హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. నాతో సిద్దు క్రేజీ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. డైలాగులు, క్యాచ్ పంచులు, ఆకట్టుకుంటున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ ప్రమోషన్లలో అసలు ఉంటది మరి మనతోటి అంటే అని డీజే డైలాగ్ వాడేశారు. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement

డీజే టిల్లు చిత్రానికి మించి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగను పురస్కరించుకుని డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టైటిల్ ప్రకటించారు మేకర్స్.టైటిల్ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమా సీక్వెల్ కు ‘టిల్లు స్క్వేర్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి డబల్ ఫన్ డబల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు సితార ఎంటర్ టైన్మెంట్స్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తోంది.

Advertisement

Also Read :   ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అంటూ మంచు విష్ణు కామెంట్స్..నెట్టింట ట్రోల్స్..!

 

మరో విశేషం ఏంటంటే డీజే టిల్లు చిత్రానికి హీరోయిన్ కాదు డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు. మొదటి చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన వీడియో కామెడీగా ఉండగా వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Also Read :  ఆ హీరో వల్లే నగ్మా రాత్రికి రాత్రే చెన్నై నుండి పారిపోవలసి వచ్చిందా..?

Visitors Are Also Reading