Home » జాతిరత్నాలు 2 అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన అనుదీప్…!

జాతిరత్నాలు 2 అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన అనుదీప్…!

by Azhar
Ad

డైరెక్టర్ అనుదీప్.. పిట్టగోడ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అభిమానుల మన్నలను పొందలేకపోయారు. అందుకే పెద్దగా గుర్తింపు అనేది సంపాదించుకోలేదు. కానీ ఆ తర్వాత జాతిరత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాడు. జాతిరత్నాలు అనే సినిమా కామెడీలో కొత్త ట్రెండ్ తెచ్చింది అని కొందరు అన్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురు ప్రధాన పాత్రలో నటించారు. అయితే అనుదీప్ కు జాతిరత్నాలు సినిమా కంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ తోనే బాగా పేరు వచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ అనేది అందరికి నచ్చింది.

Advertisement

ఇక ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ లో అడుగు పెట్ట బోతున్నాడు. అక్కడ స్టార్ హీరో అయిన శివకార్తికేయన్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. అనుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ప్రిన్స్ అని టైటిల్ పెట్టారు. ఇది తెలుగు, తమిళ్ రెండు భాషలో విడుదల అవుతుంది. ఇదిలా ఉంటె.. అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుదీప్ మాట్లాడుతూ.. జాతిరత్నాలు 2 సినిమా పై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేవి చేసాడు.

Advertisement

నేను జాతిరత్నాలు 2 అనే సినిమా తీస్తాను. కానీ ఈ సినిమా అనేది అభిమానుల ముందుకు రావడానికి కనీసం ఇంకా నాలుగు ఏళ్ళు అయిన పడుతుంది అని చెప్పాడు. అంత సమయం ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమా కథ అనేది సిద్ధం చేయలేదు. అయితే ఈ కథను సిద్ధం చేయడం అంత సులువు కాదు. అది మా టీం మొత్తానికి నచ్చాలి. ఆ తర్వాతే షూటింగ్ అనేది మొదలవుతుంది. అందుకే అంత సమయం పడుతుంది. కానీ ఎంత సమయం అయిన సరే నేను జాతిరత్నాలు 2 అనే సినిమాను తప్పకుండ తీస్తాను అని అనుదీప్ చెప్పాడు. కాబట్టి మనం ఈ సినిమా కోసం కనీసం ఇంకా 4 ఏళ్ళు వీచు చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి :

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

Visitors Are Also Reading