Home » వారసుడు వివాదానికి కారణం ఎవరో చెప్పేసిన దిల్ రాజు..!

వారసుడు వివాదానికి కారణం ఎవరో చెప్పేసిన దిల్ రాజు..!

by Anji
Ad

టాలీవుడ్ లో  అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు దిల్ రాజు. ఆయన స్థాపించిన శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ని ఒక బ్రాండ్ గా మార్చేశారు.  ఓ వైపు సొంత సంస్థలో సినిమాలు తీస్తూనే.. మరోవైపు బయటి సినిమాలకు కూడా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. విభిన్న రంగాల్లో సక్సెస్ పుల్ గా రాణిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఆయనకి విజయాలు ఎన్ని ఉన్నాయో.. ఆయన పేరు మీద విమర్శలు అదే రేంజ్ లో ఉన్నాయి. సినిమాల విడుదల విషయంలో ఆయన తీరు అనేక సార్లు వివాదాస్పదంగా మారింది. ఈ తరుణంలో తాజాగా ఆయన సొంత నిర్మాణ సంస్థలో తమిళస్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వారుసుడు సినిమా విడుదల విషయంల వివాదం తెరమీదికొచ్చింది. తాజాగా వారసుడు సినిమా వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. 

Advertisement

సాధారణంగా టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ సమయానికి పెద్ద సినిమాలు విడుదలవుతాయి. చిన్న, డబ్బింగ్ సినిమాలు వాయిదా పడతాయి.  ఈ విషయాన్ని గతంలో నిర్మాత దిల్ రాజు కూడా ఖండించాడు. సంక్రాంతి పండుగకి కేవలం స్టెయిట్ తెలుగు సినిమాలను మాత్రమే విడుదల చేయాలన్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. 

Also Read :  2 marriage:అంకుల్ తో కమిట్ అవ్వడానికి మీనా సిద్ధమైందా..కూతురు ఏడుస్తున్నా కానీ..!!

Advertisement

ముఖ్యంగా తమిళ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు చిత్రం విడుదల కోసం దిల్ రాజు భారీగా థియేటర్లను బుక్ చేసుకున్నారనే విమర్శలు వినిపించాయి. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చాడు.   సంక్రాంతికి వారసుడు సినిమా విడుదల అవుతుందని మేము 2022 మే నెలలోనే ముందుగానే చెప్పాం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల అని జూన్ నెలలో చెప్పారు. ఇక బాలయ్య నటించిన వీరసింహారెడ్డి డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ వర్క్ పూర్తి అవ్వకపోవడం వల్లనో.. లేక ఇతర కారణాల వల్లనో సంక్రాంతిని అడ్వాంటేజ్ తీసుకునో తెలియదు కానీ.. వాళ్లు కూడా సంక్రాంతి పండుగకే విడుదల అన్నారు.  

Also Read :  గాడ్ ఫాదర్ ఓటీటీకి సంబంధించి కీలక విషయాలు ఇవే..!

manam news

చిరంజీవి, బాలయ్య నటిస్తున్న రెండు సినిమాలు మైత్రీ మూవీస్ వారే నిర్మిస్తున్నారు. వారసుడు వివాదం విషయంలో మైత్రీ మూవీస్ వారికి లేని వివాదం మిగతా వారికి ఎందుకు ? ఈ వివాదం వెనుక ఎవరెవరున్నారు? ఎందుకు చేస్తున్నారనేది నాకు మొత్తం తెలుసు. నేను ఎప్పుడు కూడా వారిని డైరెక్ట్ గా వారిని ఏం అనలేదు. కావాలని వారు దీనిని వివాదం చేస్తున్నారు అని దిల్ రాజు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి పండుగకి తెలుగులో వారసుడు సినిమా విడుదలవుతుందో లేదో వేచి చూడాలి.  

Also Read :  లెజెండ్ సినిమాలో న‌టించ‌డానికి జ‌గ‌ప‌తి బాబు మొద‌ట ఎందుకు నో చెప్పారు..తెర‌వెన‌క జ‌రిగిన స్టోరీ ఇదే..!

Visitors Are Also Reading