Home » ప్రభాస్ సినిమాకి దిల్ రాజు ఎఫెక్ట్..? లాభాలు వచ్చేనా ?

ప్రభాస్ సినిమాకి దిల్ రాజు ఎఫెక్ట్..? లాభాలు వచ్చేనా ?

by Anji
Ad

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడంలో విఫలమైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ మూవీ సలార్ పైనే పడింది. పైగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ పేరుతో విడుదలవుతుంది. నైజాంలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని మంత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారు. కానీ దీనికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి.


తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నైజాంలో దిల్ రాజు టాప్ డిస్ట్రిబ్యూటర్. చెప్పాలంటే ఒక్క నైజాంనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దిల్ రాజు చేతిలో ఉంది. ఆ కారణంగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా దిల్ రాజు కనుసన్నల్లో విడుదల కావాలి. మైత్రి మూవీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి నైజాంలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సలార్ చిత్రానికి సంబంధించిన హక్కులను మైత్రి మూవీస్ సొంతం చేసుకుంది. దిల్ రాజు తక్కువకు అడుగుతున్నారన్న ఉద్దేశంతో నిర్మాతలు మైత్రి వైపు మొగ్గు చూపారు.

Advertisement


65 కోట్లు చెల్లించి నైజాం మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. ఎన్ని థియేటర్లలో విడుదల చేసుకుంటే అంత ఈజీగా కలెక్షన్లు రాబట్టొచ్చు. కానీ ఇక్కడ దిల్ రాజుకు, మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ప్రస్తుతం యానిమల్, హాయ్ నాన్న సినిమాలను నైజాంలో దిల్ రాజు విడుదల చేశాడు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ ని కూడా విడుదల చేస్తారంటున్నారు. మరోవైపు హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ కూడా సలార్ కి తలనొప్పిగా మారింది. ఈ మూడు సినిమాలతో పాటు డంకీ కూడా విడుదలయితే అనుకున్నంత స్థాయిలో థియేటర్లలో దొరికే పరిస్థితి కనపడటం లేదు. దీన్ని మైత్రి వారు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading