ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో చాలా పోటీ ఉన్న సమయంలో కొన్ని ఫ్యామిలీలే సినిమా పరిశ్రమను ఏలుతున్న సమయంలోనే దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా మొదటి సినిమా దిల్ తోనే బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన పేరుని దిల్ రాజుగా మార్చుకుని కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. అయితే ఇటీవల బలగం సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
READ ALSO : Balagam Movie Review : “బలగం” సినిమా రివ్యూ
Advertisement
ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఎక్కువగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడడం గమనార్హం. ప్రతిసారీ కేటీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయనను తన పొగడ్తలతో ముంచేత్తారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ అని కేసిఆర్ కృషివల్లే ఇదంతా జరిగింది అంటూ ఆయన చాలా పొగిడారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో దిల్ రాజు తన సొంత ఊరు అయినా నిజామాబాద్ లో ఎక్కువగా పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
READ ALSO : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!
దిల్ రాజు సొంత ఊరు నిజామాబాద్ జిల్లా నరసింగపల్లి. ఇక ఇవన్నీ చూస్తుంటే దిల్ రాజు నిజంగానే రాజకీయాల్లోకి వెళ్లడానికి ఆసక్తి పడుతున్నాడా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల వారి మదుల్లో తలెత్తుతుంది. మరి ముఖ్యంగా దిల్ రాజు టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నాడా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే దిల్ రాజు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో రాణిస్తారు కావచ్చు అని ఈ విషయం తెలిసిన వాళ్ళు భావిస్తున్నారు.
READ ALSO : మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?