Home » దిల్ రాజు, మహేష్ బాబు మధ్య మనస్పర్థలు… అందుకే తన సినిమాను..? 

దిల్ రాజు, మహేష్ బాబు మధ్య మనస్పర్థలు… అందుకే తన సినిమాను..? 

by Azhar
Ad
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పాలి. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు టాలీవుడ్ లో ఆయనే టాప్ హీరో అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యే మహేష్ బాబు నుండు రెండేళ్ల గ్యాప్ తర్వాత సర్కారు వారి పాట అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాకు మొదట్లో కలెక్షన్ బాగా ఉన్న.. తర్వాత మాత్రం తగ్గిపోయాయి. అయితే ఇలా తన సినిమా కలెక్షన్స్ అనేవి తగ్గిపోవడానికి దిల్ రాజు కారణం అని మహేష్ బాబు భావిస్తున్నాడట.
అయితే దిల్ రాజు టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత మాత్రమే కాకుండా మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. తెలంగాణలోనే థియేటర్లలో ఎక్కువ శాతం ఈయన కంట్రోల్ లోనే ఉంటాయి. అందుకే పెద్ద హిరోల్ సినిమాలు అన్ని డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాహు వద్దకే వస్తాయి. ఇక ఈ మధ్యే వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 3 అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మించింది దిల్ రాజే కావడంతో.. ఇక్కడ నైజంలో దీనికి ఎక్కువ థియేటలు అనేవి ఇచ్చాడు.
కానీ ఈ ఎఫ్ 3 సినిమా అనేది మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట అనే సినిమా వచ్చిన రెండు వారాలకే వచ్చింది. అయితే మహేష్ బాబు సినిమా కంటే.. ఈ సినిమా టికెట్ రేట్స్ అనేవి తక్కువ చేసారు. ఈ ప్రభావం అనేది మహేష్ సినిమా పైన పడింది. అందుకే దిల్ రాజుకు మహేష్ బాబుకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ కారణంగానే మహేష్ తాను త్రివిక్రమ్ తో తీస్తున్న తన తర్వాతి సినిమాను డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాజుకు ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మనస్పర్థలు అనేవి అప్పటివరకు ఉంటాయా.. లేక మధ్యలో చెదిరిపోతాయా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading