Home » యానిమల్ మూవీలో నటించిన ఈ బ్యూటీ విరాట్ కి చెల్లి అవుతుందనే విషయం మీకు తెలుసా ?

యానిమల్ మూవీలో నటించిన ఈ బ్యూటీ విరాట్ కి చెల్లి అవుతుందనే విషయం మీకు తెలుసా ?

by Anji

రణబీర్ సింగ్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రాణిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రి ఎక్కువ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రష్మిక కంటే ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను కూడా పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి ఆమెను నేషనల్ క్రష్ గా మార్చేశారు.ఇక అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో ఈ చిన్నది ఛాన్స్ పట్టేసిందని టాక్. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ భామ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.  త్రిప్తి దిమ్రి హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది.

ఆ సినిమాకు నీమాత కర్నేష్ శర్మ. స్వయానా హీరోయిన్, విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక్క వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరిగారట.త్వరలోనే ఈ జంట వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.విరాట్ కు కర్నేష్ బావ అంటే త్రిప్తి చెల్లి వరుసనే కదా అయ్యేది.అందుకే విరాట్ చెల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading