Home » రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన ఈ హీరోయిన్ జీవితం చివరికీ ఏమైందంటే ?

రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన ఈ హీరోయిన్ జీవితం చివరికీ ఏమైందంటే ?

by Anji
Ad

అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ 1970లో వారికి ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1953 జూలై 24న జన్మించిన శ్రీవిద్య.. 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో కూడా నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం లభించింది. 1971లో నోట్రుకునూరు మూవీలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఏడాదిలోనే ఢిల్లీ టు మద్రాస్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాత మనవడు చిత్రంలో ఆరంగేట్రం చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ కన్నడ వంటి భాషల్లో దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గా ఈమెనే నిలవడం విశేషం.

Advertisement

శ్రీవిద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ సినీ పరిశ్రమలో హాస్యనటుడు. తల్లి వసంత కుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి  కూలి పనికి వెళ్ళేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలు ఇవ్వడానికి కూడా సమయం సరిపోలేదని.. గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించింది.   శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండగానే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పటికే కమల్  హీరోయిన్ వాణి గణపతి తో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత  ఓ దర్శకుడితో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించింది. అయితే  ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి హాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జార్జ్ కామర్స్ ని ప్రేమించి.. 1978లో వివాహం చేసుకుంది. ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు.

Advertisement

పెళ్లి జరిగిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ ఓ షరత్ పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిస్ట్ తీసుకుందట.  పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలోకి అడుగు పెట్టింది. అయినా జార్జ్ శ్రీవిద్యను  ఇబ్బందులకు గురి చేసేవాడట.  ఆ బాధలను భరించలేక 1980లో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత కూడా శ్రీవిద్య నటనని కొనసాగించింది. విడాకులు తీసుకున్నప్పటికీ జార్జ్ మాత్రం  శ్రీవిద్యను వదలలేదట. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడట. అయితే  చివరికి సుప్రీంకోర్టులో శ్రీవిద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీ విద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. 2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఇక తాను  చనిపోవడానికి రెండు నెలల ముందు శ్రీవిద్య తన బంధువుల  సాయంతో ఓ ట్రస్ట్ స్థాపించింది.   పేద విద్యార్థులు, చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించే విధంగా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలునామాలో వెల్లడించింది. అంతే కాదు.. తన సోదరుడు, ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. 2006 అక్టోబర్ 19 శ్రీవిద్య తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. ఇలా శ్రీవిద్య జీవితం కొనసాగింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది ఆమెనేనా.. మ్యారేజ్ పై క్లారిటీ..!

Upasana: మరోసారి గొప్ప పని చేస్తున్న ఉపాసన.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు!

Visitors Are Also Reading