Home » శోభన్ బాబు వల్ల జయసుధ రూ.300 కోట్లు పోగొట్టుకుందా ?

శోభన్ బాబు వల్ల జయసుధ రూ.300 కోట్లు పోగొట్టుకుందా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్న అలనాటి తారల్లో జయసుధ ఒకరు. తన అద్భుతమైన నటనతో సహజ నటిగా పేరు సంపాదించుకున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ, ఆ తరువాత తిరుగులేని నటిగా ఎదిగింది.

shobanbabu

Advertisement

సినిమాల్లో ఆమె ఎంట్రీకి మహానటి సావిత్రి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మరీ ఈ రేంజ్ లో టాలీవుడ్ ను ఏలేసిన జయసుధ సంపాదించుకున్న ఆస్తి గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

అప్పట్లో శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి వారు సంపాదించిన ఆస్తి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ను దాదాపు రెండు దశాబ్దాల పాటు శాసించిన ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు అప్పట్లోనే మంచి రెమ్యునరేషన్ అందుకు అని.. బాగా ఆస్తులు కూడబెట్టుకున్నారట. అయితే హీరోయిన్లుగా బాగా సంపాదించడం తెలిసిన వీరికి ఆ సంపాదనను ఎలా రెట్టింపు చేసుకోవాలి అనే విషయం మాత్రం తెలిసేది కాదట. ఈ తరుణంలో జయసుధ రూ.300 కోట్లకు పైగా ఆస్తులు పోగొట్టుకుందనే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె ఆస్తులు పోగొట్టుకోవడానికి లేదా జయసుధ ఆస్తులకు, స్టార్ హీరో శోభన్ బాబుకి లింక్ ఏంటంటే..? అప్పట్లో చాలా మంది స్టార్స్ కి శోభన్ బాబు ఆస్తులను కూడబెట్టడంలో హెల్ప్ చేసేవారట.

Advertisement

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ? సంపాదనను ఎలా రెట్టింపు చేసుకోవాలి ? అనే సలహాలు, సూచనలు ఇచ్చేవారట. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన జయలలిత హైదరాబాద్ శివారులో 100 ఎకరాల్లో ద్రాక్ష తోటలు కొనుగోలు చేసిందట. అవి ఇప్పటికీ ఉన్నట్టు సమాచారం. శోభన్ బాబు తన మేనేజర్ తో కలిసి జయసుధతో సహా అప్పట్లోనే చాలా మంది స్టార్స్ ఆస్తులను స్వయంగా పర్యవేక్షించేవారట. అయితే ఆయన చనిపోయిన తరువాత ఆస్తులు కబ్జాకు గురికావడం.. సినిమాల వల్ల వాటిని పట్టించుకునే తీరిక లేకపోవడంతో జయసుధకు విసుగు వచ్చి.. వాటిని సగం ధరలకే అమ్మేసిందట. అలా దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సగం రేటుకే అమ్మేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపించడం విశేషం.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading