Home » గుంటూరు కారం నుంచి బ్రేకింగ్ న్యూస్.. పూజా స్థానంలో మీనాక్షి..?

గుంటూరు కారం నుంచి బ్రేకింగ్ న్యూస్.. పూజా స్థానంలో మీనాక్షి..?

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెత్తున మూవీ గుంటూరు కారం. ఈ మూవీ విషయంలో అసలు ఎప్పుడూ ఏం జరుగుతుందో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు.. ఎందుకు తీసేస్తున్నారు అనేది మాత్రం అసలు అంతుచిక్కడం లేదు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత థమన్ తో పాటు పూజా హెగ్డే కూడా ఔట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా శ్రీలీల వల్లనే పూజా హెగ్డే వెళ్లిపోయిందని కొందరు పూజా స్థానంలో సంయుక్త మీనన్ వస్తుందని మరికొందరు.. పూజ నటన నచ్చకనే త్రివిక్రమ్ తీసేసాడని ఇంకొందరు రకరకాలుగా చెబుతున్నారు. అసలు ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికీ తెలియదు. ఇవన్నీ పక్కకు పెడితే తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. అదేంటంటే.. పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదనే’ మూవీతో మీనాక్షి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అవకాశాలు మాత్రం బాగానే అంది పుచ్చుకుంది.

Advertisement

కిలాడి చిత్రంలో రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదికూడా ఈ అమ్ముడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇక  దీని తర్వాత హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ కొద్దో గొప్పో హిట్ అందుకుంది. ఫేమస్ అవ్వాలంటే హిట్స్ అందుకోవాలా.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే చాలు.. మీనాక్షి ఇంస్టాగ్రామ్ తోనే చాలా ఫేమస్ అయ్యింది. నిత్యం ఫోటోషూట్ తో రెచ్చిపోయిన ఈ భామ టాలెంట్ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ కంట పడింది. ఎట్టకేలకు మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ హీరోయిన్. ఈ సినిమాతో మీనాక్షి దశ తిరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?

పాప ఎవరి పోలికనో చెప్పేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్..!

లెజెండ్ మూవీలో నటించిన ఈ చిన్నారి ఎవ్వరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading