Home » టాలీవుడ్ లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య కన్నుమూత

by Anji
Ad

ఈ మధ్య కాలంలో  సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గతకొద్ది రోజులుగా ఒకరితర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రూహి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా సెంథిల్ భార్య రూహి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. రేపు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. రూహి యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు.

Advertisement

Advertisement

సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ దూసుకుపోతున్నారు. ఐతే సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన సెంథిల్ రాజమౌళి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలకు సెంథిల్ పనిచేశారు. ఇప్పుడు ఆయనకు సతీవియోగం కలగడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.  పలువురు సినీ ప్రముఖులు సెంథిల్ ను పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Visitors Are Also Reading