Home » ‘తెలుసా.. మనసా’ ట్యూన్‌ని కీరవాణి ఎక్కడి నుంచి కాపీ కొట్టారో మీకు తెలుసా ?

‘తెలుసా.. మనసా’ ట్యూన్‌ని కీరవాణి ఎక్కడి నుంచి కాపీ కొట్టారో మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన సినిమాల్లో పాటలు తప్పనిసరిగా ఉండాలి. అయితే వాటిని వీనుల విందుగా అందించేందుకు సంగీత దర్శకులు ఎంతో కృషి చేస్తారు. ఒక్కోసారి వారికి ట్యూన్ నచ్చితే ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. తమ కెరీర్ లో ఇతర భాషల నుంచి సంగీతాన్ని దిగుమతి చేసుకున్న సందర్భాలు లేని సంగీత దర్శకులు కూడా ఉన్నారు. వారిలో ఇళయ రాజా ఒకరు. 

telusa-manasa-song

Advertisement

 

ఇప్పటివరకు ఆయన చేసిన ట్యూన్స్ అన్నీ సొంతంగా చేసినవే. కొన్ని సందర్భాల్లో దర్శకుల అభిరుచి మేరకు వారికి నచ్చిన ట్యూన్స్ ని కొందరూ దిగుమతి చేసుకుంటారు. జర్మనీ నుంచి దిగుమతి అయిందే తెలుసా.. మనసా పాట ట్యూన్. నాగార్జున హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన క్రిమినల్ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.. ఈ సినిమాలోని తెలుసా.. మనసా సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హిందీలో కూడా ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ పాట ఎనిగ్మా అనే ఓ జర్మన్ బ్యాండ్ ట్యూన్ చేసింది. ఏజ్ ఆఫ్ లోన్లీనెస్ అనే ఈ పాట లిరిక్ లేకుండా కేవలం హమ్మింగ్ తో మ్యూజిక్ తో సాగుతుంది. యధాతథంగా కీరవాణి కాపీ చేశారు. లిరిక్ తో వచ్చే ట్యూన్ ని మాత్రం ఆయన సొంతంగా ట్యూన్ చేశారు.

Advertisement

 

ఎనిగ్మా ట్యూన్ చేసిన ఆ హమ్మింగ్ ను, మ్యూజిక్ కాపీ చేసినప్పటికీ ఆ పాటలో ఓ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చారు కీరవాణి. మన పాటే అన్నంత అందంగా మొత్తం పాటను కంపోజ్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఈ పాట పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ ని క్రి**మినల్ సినిమాలో పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ట్యూన్ ని జగపతిబాబు హీరోగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన అల్లరి ప్రేమికుడు కోసం చేశారు. ఆ సినిమాలోని ఓ సందర్భం గురించి చెప్పి దానికి తగిన పాట కావాలని కీరవాణిని కోరడంతో కొన్ని ట్యూన్స్ వినిపించారు.

అందులో తెలుసా.. మనసా ట్యూన్ ఒకటి. కలికి చిలుక ము**ద్దు తాంబూలం ఇమ్మందని అంటూ సాగే సాహిత్యంలో ఆ ట్యూన్ వినిపించారు. తాను అనుకున్న సన్నివేశానికి అది సరిపోదని భావించిన రాఘవేంద్రరావు చిలిపి చిలక ఐలవ్ యూ అన్న వేళలో.. అంటూ సాగే ట్యూన్ ని ఎంపిక చేసుకున్నారు. తరువాత కొంత కాలానికి క్రి**మినల్ సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ లో తెలుసా.. మనసా ట్యూన్ వినిపించారు. దానిని మహేష్ భట్ వెంటనే ఓకే చేశాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యాన్ని అందించగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా మధురంగా పాడారు. అలా ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది.

Also Read : ‘మనదేశం’ కంటే ముందే సినిమాల్లో అవకాశం వచ్చినా ఎన్టీఆర్ చేయలేదు.. కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading