Home » చిరంజీవి మీద కోపంతో బాబూమోహన్ అలా చేశాడా ?? వామ్మో ఇంత కోపం ఎందుకయ్యా

చిరంజీవి మీద కోపంతో బాబూమోహన్ అలా చేశాడా ?? వామ్మో ఇంత కోపం ఎందుకయ్యా

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ టాప్ కమెడీయన్లలో బాబు మోహన్ ఒకరు. ఒకప్పుడు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత సినిమాలను తగ్గించేశాడు. తొలుత టీడీపీలో కొనసాగాడు. ఆ తరువాత టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో రాజకీయాల్లో కొనసాగి..

chiru-and-babumohan

Advertisement

ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరాడు బాబు మోహన్.  టీడీపీ, టీఆర్ఎస్ తరపున ఆంధోళ్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాడు.  ఇటీవలే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి ‘ముఠా మేస్త్రీ’ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది.  “నా గురించి మూడు నెలలపాటు ఓ సీన్ షూటింగ్ అగిపోయింది. చిరంజీవికి విసుగెత్తిపోయి.. మీరేం చేస్తారో నాకు అనవసరం.. ఈరోజో, రేపో షూటింగ్ అయిపోవాలన్నాడు. రెండు గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. ఓ టైం ఫిక్స్ చేసి రావాలని చెబితే.. ప్రయత్నిస్తానన్నాను. ఇంకా ట్రై చేయడమేంటి? అని సీరియస్ అయ్యాడు. నేను స్టొరీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను.

ఇక అదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామనుకున్నాను. తీరా అప్పటికే మెగాస్టార్ అక్కడున్నారు. షూటింగ్ నుంచి వచ్చావా? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం ఇంతే.. అని బాధపడ్డాడు. బ్రష్ చేసుకోమని చెప్పి ఇంటి  దగ్గరి నుంచి దోసెలు తెప్పించాడు. నేను తొందర తొందరగా తింటుంటే చూసి సంతోషించాడు..  బాధపడ్డాడు. నాకూ తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీలయ్యాడు’ అని చెప్పుకొచ్చాడు.

Also Read : విశాల్‌ రత్నం ఫస్ట్‌ సింగిల్‌ ‘Dont Worry Da Machi’ వచ్చేసింది

Visitors Are Also Reading