Home » చింతన్ శిబిర్ : సోనియాకు తలనొప్పి తీసుకువచ్చిన కాంగ్రెస్ నాయకులు..!

చింతన్ శిబిర్ : సోనియాకు తలనొప్పి తీసుకువచ్చిన కాంగ్రెస్ నాయకులు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మార్పులు,చేర్పుల కొరకు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో చింతన్ శిబిర్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే చింతన్ శిబిర్ లో జరుగుతున్నటువంటి అనూహ్య డిమాండ్ ను కాంగ్రెస్ నాయకులు తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తన కుమార్తె ప్రియాంక గాంధీని నియమించాలని మొత్తం ప్రతినిధుల నుంచి డిమాండ్ పెరగడంతో హైకమాండ్ అంతా ఒక్క సారిగా షాక్ కు గురయింది. అయితే ఉదయాన్నే మీటింగ్ లో భాగంగా రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పిన నేతలంతా ఒక్కసారిగా సాయంత్రానికి మాట మార్చారు. కానీ ఈ టైంలో హైకమాండ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.ఇంకోవైపు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేకుంటే ఆలస్యం ఏమీ చేయకుండా ప్రియాంక గాంధీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి రచ్చ జరుగుతున్న అక్కడే ఉన్నటువంటి రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలు మాత్రం సైలెంట్ గా ఉండి పోయారు. కొత్తగా తెరమీదికి ప్రియాంక పేరు రావడంతో హైకమాండ్ కు తలనొప్పి మొదలైందని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ;

Advertisement

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఈ సినిమానే…!

మహేష్ బాబుకు వ్యతిరేకంగా షారుఖ్ ను నిలబెడుతున్న ఫ్యాన్స్..!

 

Visitors Are Also Reading