Home » నీచుల్లారా.. పరువు తీశారు కదారా..? సంచలన ట్వీట్ చేసిన బండ్ల గణేష్

నీచుల్లారా.. పరువు తీశారు కదారా..? సంచలన ట్వీట్ చేసిన బండ్ల గణేష్

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఆయన ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా అప్పటికి సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడుతూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈయన సోషల్ మీడియా వేదిక లేదా ఏదైనా కార్యక్రమాలు పాల్గొన్న సమయంలో తాను మాట్లాడే మాటలు వివాదంగా మారుతుంటాయి. అలా చాలా సందర్భాల్లో కూడా ప్రూవ్ అయింది. తాజాగా బండ్ల గణేష్ అమెరికాలో జరుగుతున్నటువంటి తానా కార్యక్రమంలో భాగంగా చోటు చేసుకున్న గొడవ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఎన్నారైలపై విమర్శలు చేశారు.

Advertisement

అమెరికా వేదికగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలపై నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కానా పరువు తీస్తున్నారు కదా.. దాన్ని నిర్మించడానికి ఎంతో మంది మన జాతి పెద్దలు పాడిన కష్టాన్ని గంగను కలిపారు.. నీచుల్లారా అంటూ ఈయన అసహనం వ్యక్తం చేస్తూ చేసినటువంటి టీ-టు ప్రస్తుతం సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో.. ఇద్దరు హీరోలు అభిమానులు రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే దీని గురించి బండ్ల గణేష్ స్పందించడం గమనార్హం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమా వైపు వచ్చిన నటులు వీరే..!

Visitors Are Also Reading