Home » బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన 2 సినిమాలు ఏవో మీకు తెలుసా..?

బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన 2 సినిమాలు ఏవో మీకు తెలుసా..?

by Sravya

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా రాజమౌళితో ఒక్క సినిమా అయినా లైఫ్ లో చేయాలని చాలా మంది హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో కలలు కంటూ ఉంటారు. రాజమౌళి సినిమా ప్రతీ సినిమా కూడా హిట్ అయిందే తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టలేదు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ కి మంచి హిట్ ని ఇచ్చాడు అదే విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కి కూడా మంచి హిట్ ని ఇచ్చాడు.

rajamouli

సీనియర్ హీరోలతో పెద్దగా రాజమౌళి సినిమాలు చేయలేదు. బాలకృష్ణ తో మాత్రం రాజమౌళి సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. మరి బాలకృష్ణ రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన సినిమాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి బాలకృష్ణని హీరోగా పెట్టి సింహాద్రి సినిమాని తెర మీదకి తీసుకురావాలని అనుకున్నారు. ఎన్టీఆర్ భూమిక కాంబినేషన్లో సింహాద్రి సినిమా అప్పట్లో రిలీజ్ అయి మంచి
హిట్ ని అందుకుంది.

రాజమౌళి కథని బాలకృష్ణ కి ముందు చెప్తే అప్పుడు బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో బాలకృష్ణ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటికి రాజమౌళి కేవలం ఒక్క సినిమాను మాత్రమే తెర మీదకు తీసుకొచ్చారు అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి కంటే పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు.

ఇలా సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నారు బాలయ్య. దాంతో ఎన్టీఆర్ ని పెట్టి రాజమౌళి సినిమా తీసారు. మగధీర సినిమా స్టోరీ ని కూడా మొదట బాలకృష్ణకి చెప్పారు రాజమౌళి కానీ బాలయ్య ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నారు ఇలా బాలకృష్ణ రాజమౌళి కాంబినేషన్లో రావాల్సిన రెండు సినిమాలు కూడా రాలేదు.

Also read:

హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఆ హీరోతో సినిమాని చెయ్యనని ”రాజమౌళి” చెప్పడానికి.. కారణం ఏమిటి అంటే..?

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రామానాయుడు కోరిక ఇది.. మరి నెరవేరుతుందా..?

Visitors Are Also Reading