Home » తార‌క‌ర‌త్న పెద్ద‌క‌ర్మ‌లో ఎన్టీఆర్ ను బాల‌య్య దూరం పెట్టారా..? నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో..!

తార‌క‌ర‌త్న పెద్ద‌క‌ర్మ‌లో ఎన్టీఆర్ ను బాల‌య్య దూరం పెట్టారా..? నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో..!

by AJAY
Ad

నంద‌మూరి ఫ్యామిలీలో సైలెంట్ వార్ జరుగుతోందా..? ఎన్టీఆర్ ను బాల‌య్య దూరం పెడుతున్నారా.? ఇలా కొన్ని ప్ర‌శ్న‌లు ఇప్పుడు చాలా మందికి వ‌స్తున్నాయి. అస‌లు అలాంటి ప్ర‌శ్న‌లు ఎందుకు మొద‌ల‌య్యాయి..ఏం జరిగింది అన్న‌ది ఇప్పుడు చూద్దాం..ఇటీవ‌ల నంద‌మూరి వార‌సుడు హీరో తార‌క‌ర‌త్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నారాలోకేష్ ప్రారంభించిన యాత్రలో తార‌క‌ర‌త్న ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేసేందుకు వెళ్లారు.

Advertisement

మొద‌టి రోజు ఓ ఆల‌యంలో పూజ‌లు చేసి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర ప్రారంభించారు. పాదయాత్ర‌లో పాల్గొన్న తార‌క‌ర‌త్న ఒక్క‌సారిగా గుండెపోటు రావ‌డంతో కింద‌ప‌డిపోయారు. దాంతో కార్య‌క‌ర్త‌లు స్థానికులు తార‌క‌ర‌త్న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బెంగుళూరు ఆస్ప‌త్రిలో తార‌క‌ర‌త్న మృత్యువుతో పోరాడుతూ క‌న్నుమూశారు.

ALSO READ :Balagam Movie Review : “బలగం” సినిమా రివ్యూ

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా తార‌కర‌త్న పెద్దక‌ర్మ జ‌రిగింది. పెద్ద‌క‌ర్మ‌కు స‌న్నిహితులు మ‌రియు బంధువులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి బాల‌కృష్ణ మోక్షాజ్ఞ‌, ఎన్టీఆర్ మ‌రియు క‌ల్యాణ్ రామ్ లు సైతం హాజ‌రయ్యారు. వ‌చ్చిన‌వారంతా అలేఖ్యారెడ్డిని ఓదార్చారు. ఇక పెద్ద‌క‌ర్మ‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఒక వీడియోలో ఎన్టీఆర్ మ‌రియు కొంత‌మంది ఒక‌ద‌గ్గ‌ర కూర్చుని ఉన్నారు.

కాగా బాల‌య్య అంద‌రినీ మంద‌లించుకుంటూ వెళుతున్నారు. కానీ ఎన్టీఆర్ ను మాత్రం బాల‌య్య కృష్ణ మంద‌లించిన‌ట్టు క‌నిపించ‌లేదు. దాంతో బాల‌కృష్ణ ఎన్టీఆర్ ను కావాలనే దూరం పెడుతున్నారా అంటూ వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే అలాంటి కామెంట్ ల‌పై నంద‌మూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ వీడియోలో ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ ను బాల‌య్య కూర్చోమ‌న్నార‌ని మ‌రోవీడియోలో ఏదో బిజీగా ఉండి మాట్లాడ‌లేదేమో దానికే ర‌చ్చ అవ‌స‌ర‌మా అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ALSO READ :మొద‌టిసారి కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్…నెట్టింట వైరల్..!

Visitors Are Also Reading