Home » బాలకృష్ణ టాక్ షోలో గందరగోళం.. పవన్ కళ్యాణ్ వల్లేనా ..?

బాలకృష్ణ టాక్ షోలో గందరగోళం.. పవన్ కళ్యాణ్ వల్లేనా ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఈ తరుణంలో ఈ టాక్ షో కి మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వేలాదిమంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు. వేలాదిమంది అభిమానుల మధ్య ఈలలు వేస్తూ కేకల నడుమ కారు దిగి వచ్చి పవన్ కళ్యాణ్ బాలకృష్ణను హగ్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన నందమూరి మరియు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

Advertisement

also read;Ap laptop scheme: ఏపీ విద్యార్థులకు లాప్ టాప్స్ అందించనున్న జగన్ సర్కార్..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 11 గంటలకి అన్నపూర్ణ స్టూడియో కి రాబోతున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సెట్స్ లోపలికి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. ఈ తరుణంలో స్టూడియో వద్ద కాస్త గందరగోళం ఏర్పడింది. ఈ షో చూడడానికి అభిమానులే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు కూడా క్యూ కట్టారు.. ఈ షో సాగుతున్నంతసేపు ఫ్యాన్స్ అంతా ఆ స్టూడియోలోనే పడిగాపులు గాస్తూ నినాదాలు చేశారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాగానే సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

బాబుల కే బాబు పవన్ కళ్యాణ్ బాబు అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. ఇక సెట్ లోపల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాలకృష్ణ వేస్తున్న ప్రశ్నలకు అడ్డుపడుతూ .. అభిమానులంతా నినాదాలు చేస్తూ చాలా గందరగోళం సృష్టించారట.. దీంతో బౌన్సర్లు అక్కడ ఎక్కువగా అల్లరి చేస్తున్న కొంతమంది ఫ్యాన్సును బయటకు పంపినట్టు తెలుస్తోంది. అయితే ఈ షో చూడడానికి నిర్మాత నాగ వంశీ , దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ వచ్చారని అంతేకాకుండా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, తన అల్లుడు భరత్ లు కూడా పవన్ కళ్యాణ్ ను చూడడం కోసం ఎదురుచూసినట్టు తెలుస్తోంది ..

also read;ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారిందంటే ?

Visitors Are Also Reading