Home » తారకరత్న కోసం బాలకృష్ణ కీలక నిర్ణయం!

తారకరత్న కోసం బాలకృష్ణ కీలక నిర్ణయం!

by Bunty
Ad

బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారు. నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో పాటు మెదడులోని ఇతర భాగాలకు స్పందన లేకపోవడంతో విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు.

Advertisement

 

నిజానికి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  ఈ క్రమంలో తారకరత్న చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రాలు చెబుతున్నారట. తన అన్న కొడుకు కోలుకోవాలని బాలయ్య నిద్రాహారాలు మానేసి మరి హాస్పిటల్ వద్ద పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. తారకరత్న కుప్పంలోని హాస్పిటల్ చేరి స్పృహ కోల్పోయినప్పుడు బాలయ్య అతని చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పారట. దీంతో అతని శరీరం ట్రీట్మెంట్ కు సహకరించడం మొదలుపెట్టినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

 

అలాగే చిత్తూరులో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు తారకరత్నకు విదేశీయులు ట్రీట్మెంట్ మొదలు పెడుతున్న తరుణంలో మరోసారి తారకరత్న చెవిలో మరోసారి బాలయ్య మృత్యుంజయ మంత్రాలు చదివినట్టుగా తెలుస్తుంది. అలాగే తారక ఆరోగ్యం కుదుటపడేంత వరకు షూటింగ్లకు దూరంగా ఉండాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారట. దీంతో NBK 108 షూటింగ్ లేటుగా ప్రారంభం కానున్నట్టు సమాచారం అందుతుంది.

READ ALSO : Dasara : దసరా నుంచి ‘ఓరి వారి’ సాంగ్…దుమ్ములేపిన నాని

Visitors Are Also Reading