Home » బాలకృష్ణని ఆ నిర్మాతలు మోసం చేశారా ? ఆ విషయంలో చిరంజీవినే బెస్ట్..!

బాలకృష్ణని ఆ నిర్మాతలు మోసం చేశారా ? ఆ విషయంలో చిరంజీవినే బెస్ట్..!

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎవ్వరికీ ఏ ఆపద, అవసరం అని చెప్పగానే ఎంతటి సహాయం చేసేందుకు అయినా ఓకే చెబుతారు బాలయ్య. అలాంటి బాలకృష్ణని చాలా మంది నిర్మాతలు మోసం చేశారట. ఇదే విషయాన్ని స్వయంగా ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత చెప్ప్పుకొచ్చాడు. ముఖ్యంగా పారితోషికం విషయంలో బాలయ్య సీరియస్ గా ఉండరు. ఆ కారణంగానే ఆయనను చాలా మంది నిర్మాతలు పారితోషికం విషయంలో మోసం చేశారట. 

Also Read :  సీనియర్ ఎన్టీఆర్ ఆ ఆభరణాలను దాచిపెట్టడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే..!

Advertisement

ఇక చాలా మంది నిర్మాతలు నామమాత్రపు రెమ్యునరేషన్ ఇచ్చి ఆ తరువాత సినిమా లాభాలలో వాటాను ఇస్తామంటూ బాలయ్యకి హామీ ఇస్తారు. అలా ఒప్పంద పత్రాలను కూడా రాసుకున్నారట. అయినప్పటికీ బాలకృష్ణకి నిర్మాతలు ఇచ్చే మొత్తం చాలా తక్కువ. కోట్లలో లాభాలు వస్తే.. లక్షల్లో బాలయ్యకి సందర్భాలు చాలానే ఉన్నాయట. కొందరూ లాభాలు వచ్చినప్పటికీ కూడా నష్టం వచ్చిందని బాలకృష్ణ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట. చాలాసార్లు బాలకృష్ణ పారితోషికం విషయంలో మోసపోయారట. అయినప్పటికీ కూడా ఇంకా నిర్మాతలను నమ్ముతూనే ఉన్నాడు. 

Advertisement

Also Read :  ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఒకవేళ తన సినిమా వల్ల ఎవరైనా నిర్మాత కూడా నష్టపోయినట్టయితే వారికి తిరిగి డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. బాలకృష్ణ మంచి తనాన్ని చాలా మంది అలుసుగా తీసుకొని మోసం చేస్తున్నారంటూ ఆయన సన్నిహితులు గతంలో పలుమార్లు మీడియా ముందు కూడా చెప్పారు. చిరంజీవి మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ముందుగానే పారితోషికం విషయంలో పక్కాగా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా ఇచ్చిన తరువాతనే సినిమా విడుదలకు ఓకే చెబుతారట. విడుదల తరువాత కూడా లాభాలలో వాటా తీసుకునేది ఉంటే.. తన మనిషిని వసూళ్ల విషయంలో ఉంచుతారట. చిరంజీవి తనకు రావాల్సిన ప్రతి పైసాను కూడా రాబట్టుకుంటాడట. పారితోషికం రాబట్టే విషయంలో బాలయ్య కంటే చిరంజీవే బెస్ట్.

Also Read :  హారతిపళ్లెంలో డబ్బులు ఎందుకు వేయాలో తెలుసా..?

Visitors Are Also Reading