టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు… ఇండస్ట్రీకి దూరమయ్యారు. కరోనా మరియు ఇతర సమస్యల కారణంగా టాలీవుడ్ ప్రముఖులు మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే తాజాగా బలగం సినిమా నటుడు మరణించాడు. కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బలగం సినిమాలో సర్పంచి పాత్రలో నటించిన నర్సింగo తాజాగా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా బలగం దర్శకుడు వెల్దండి వేణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే నర్సింగం కు నివాళులు అర్పించిన వెల్దండి వేణు…. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement
నర్సింగం బాపుకు శ్రద్ధాంజలి.. చివరి రోజులలో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ణి చూసి నేను ఎంతో సంతోషించా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి… అంటూ బలగం వేణు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా… బలగం సినిమా ఈ ఏడాది మొదట్లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి.
ఇవి కూడా చదవండి
Icc world cup 2023 : వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన.. తిలక్, చాహాల్ ఔట్!
Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!
Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!