Home » అఖిల్ తో సినిమాలు ఈ హీరోయిన్ల పాలిట శాపంగా మారాయా..?

అఖిల్ తో సినిమాలు ఈ హీరోయిన్ల పాలిట శాపంగా మారాయా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అక్కినేని ఫ్యామిలీలో మూడవ తరం హీరోగా అఖిల్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయినా సరైన గుర్తింపు సంపాదించు కోలేకపోతున్నాడు.. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. ఆ తర్వాత నాగచైతన్య ఓ మోస్తారుగా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు.. ఇక హీరో అఖిల్ మాత్రం ఇంకా సరైన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలోనే అక్కినేని ఫ్యామిలీ పేరు చెబితే హీరోయిన్స్ చాలా మంది భయపడుతున్నారట. దీనికి ప్రధాన కారణం అక్కినేని హీరోల్లో మొదటి సినిమాకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అఖిల్.. సిసింద్రీ సినిమాతోనే మంచి పాపులారిటీ వచ్చింది.

also read:ఈ చిరంజీవి హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి..!!

Advertisement

Advertisement

కానీ హీరోగా పాపులారిటీ సంపాదించుకోలేక పోతున్నారు. తన కెరియర్ మొత్తం లో చెప్పుకోదగ్గ సినిమా కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే. అయితే ఈ చిత్రం విజయంలో ఎక్కువ శాతం వాటా పూజా హెగ్డే కే దక్కింది. అయితే ప్రస్తుతం చాలామంది హీరోలు అఖిల్ తో నటిస్తే మా కెరియర్ నాశనం అవుతుందని భావిస్తున్నారట. అఖిల్ ఇప్పటివరకు తీసిన సినిమాలు నాలుగే. ఇందులో మొదటి సినిమా అఖిల్ పేరుతోనే వచ్చింది. ఈ సినిమాలో బ్యూటీ సయేషా సైగల్ నటించింది. దీని తర్వాత ఆమె తెలుగులో ఎక్కడా కనిపించలేదు.

also read:పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?

ఇక రెండవ సినిమా హలో. ఇందులో హీరోయిన్ గా ఫుల్ బ్యాగ్రౌండ్ ఉన్న ప్రియదర్శిని నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ హీరోయిన్ కనిపించలేదు. మూడో సినిమా మిస్టర్ మజ్ను.ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ చేసింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. ఇక నాలుగవ సినిమా విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అఖిల్ సినిమాల్లో హిట్ అయిన మొదటి చిత్రం. ఇందులో నటించిన పూజకి మళ్లీ కెరియర్ ఏ మాత్రం బాగాలేదు.

also read:నాగార్జున వల్లే నాగచైతన్య స్టార్ హీరో కాలేకపోతున్నాడా..?

Visitors Are Also Reading