Home » మొద‌టిసారి స్టేజ్ పైనే ఏడ్చేసిన అన‌సూయ‌…వీడియో వైర‌ల్..!

మొద‌టిసారి స్టేజ్ పైనే ఏడ్చేసిన అన‌సూయ‌…వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

యాంక‌ర్ అనసూయ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగులో జ‌బర్ద‌స్త్ కామెడీ షో కు అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ షో ఎంతో స‌క్సెస్ అవ్వ‌డంతో పాటూ అన‌సూయ‌కు కూడా పాపులారిటీ వ‌చ్చింది. ఇక అన‌సూయ ప్రస్తుతం యాంక‌ర్ గా కంటే న‌టిగా ఎక్కువ బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాల‌లో న‌టిస్తోంది. అంతే కాకుండా కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌లోనే కాకుండా పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల‌లో కూడా న‌టిస్తోంది.

ALSO READ: కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !

Advertisement

Advertisement

ఈ నేప‌థ్యంలోనే అన‌సూయ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌మార్తాండ సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, ప్ర‌కాష్ రాజ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. కాగా ఈ చిత్రంలో అన‌సూయ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. కాగా తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. ఈ ప్రెస్ మీట్ లో అన‌సూయ‌, కృష్ణ‌వంశీ, బ్ర‌హ్మాజీ,అన‌సూయ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాగా అన‌సూయ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ సినిమాలో అన‌సూయ ప్ర‌కాష్ రాజ్ కు కోడ‌లి పాత్రలో న‌టించారు. కాగా ఈ సినిమా చూసిన త‌ర‌వాత అంద‌రూ త‌న‌ను తిడ‌తార‌ని చెప్పారు. కాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూనే అన‌సూయ కంట‌త‌డి పెట్టుకున్నారు. అయితే అన‌సూయ ఎప్పుడూ హుషారుగా క‌నిపిస్తార‌నే సంగ‌తి తెలిసిందే.దాంతో మొద‌టి సారి అన‌సూయ ఏడ‌వ‌టంతో అంద‌రూ ఆశ్చర్య‌పోయారు.

ALSO READ : పవన్ కళ్యాణ్ బాలు సినిమాను కాపీ కొట్టి హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading